Nidhhi Agerwal Government Vehicle : ‘వీరమల్లు’ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం హట్టాపిక్గా మారింది. తాజాగా ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనాన్ని వినియోగించడంపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. తాజాగా నిధి అగర్వాల్ ప్రభుత్వ వాహనంలో వెళుతున్నట్టు కనిపించింది. దీనిపై నెటిజన్స్, ప్రతిపక్షాలు, పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చర్చ, రచ్చ చేస్తున్నారు. ప్రభుత్వం రంగంతో సంబంధం లేదని నిధి అగర్వాల్.. ప్రభుత్వ వాహనంలో ప్రయాణించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో నిర్వహించే వాహనాలను వ్యక్తిగత, వాణిజ్య కార్యక్రమాలకు ఎలా ఉపయోగిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే కేటాయించిన ఈ వాహనాలను ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన నటికి కేటాయించడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి.
నిధి స్పందన ఇదే…
తాజాగా ఈ వివాదంపై నిధి స్పందించింది. ఇది ప్రభుత్వ వాహనమే కానీ, తనకు లోకర్ ఆర్గనైజర్స్ అరెంజ్ చేశారని స్పష్టం చేసింది. అంతేకాని తాను ప్రత్యేకంగా వెహికిల్ కోసం ఏపీ ప్రభుత్వాన్ని కోరలేదని తెలిపింది. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నిజం కాదని నిధి తెల్చేసింది. మరోవైపు ఇది ప్రభుత్వ వాహనం కాదని, ప్రైవేటు వెహికిల్ అంటూ జనసేన నేతలు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. నిధి అగర్వాల్ ఓ జూవెల్లరి షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా విజయవాడ వెళ్లింది. దీంతో ఆమె రవాణా సదుపాయాల కోసం సదరు సంస్థ ఆమెకు ఈ వాహనాన్ని కెటాయించారట. ఈ వాహానికి జువెల్లరీ షోరూం యజమనులకు సంబంధించినది అని తెలుస్తుంది. తమ బ్రాండ్ ప్రకటన కోసం విజయవాడ వచ్చిన ఆమెను స్వాగతం చెబుతూ.. ఎయిర్పోర్టకు ఈ వావానాన్ని పంపించారట. ఇది ప్రభుత్వ వాహనం కాదని, ప్రైవేట్ వెహికల్ అంటూ అసలు విషయం బయటపెట్టారు.
నెటిజన్లు, ప్రతిపక్షాల విమర్శలు
ఇదంత కావాలనే చేస్తున్నారనే వారు అభిప్రాయపడ్డారు. నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్.. డిఫేం చేసేందుకు ఈ దుష్మచారం చేశారని, కావాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిధి ప్రయాణించిన ఈ వాహనికి, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని, ఇది అసలు ప్రభుత్వ వాహనం కాదని జనసేన ఈ వివాదానికి తెరదింపింది. మరి ఇకనైనా ఈ వివాదానికి తెర పెడుతుందో లేదో చూడాలి. ఏదేమైనా జువెల్లరి షో రూం ఒపెనింగ్కి వెళ్లిన నిధికి ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం ఫ్యాన్స్ని బాధిస్తోంది. కాగా లాంగ్ గ్యాప్ తర్వాత నిధి హరి హర వీరమల్లు మూవీతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణలు దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఈ సినిమా రూపొందింది.
— Nidhhi Agerwal 🌟 Panchami (@AgerwalNidhhi) August 11, 2025
Also Read: Jr NTR: ఎన్టీఆర్ కాలర్ కథ ఇదే… ఎత్తిన ప్రతిసారి రిజల్ట్ ఎలా ఉందంటే ?
లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ
ఇందులో నిధి హీరోయిన్గా నటించింది. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాల్లో నటించింది. అయితే వరుస ప్లాప్స్ తర్వాత ఇస్మార్ట్ శంకర్తో తొలి కమర్షియల్ హిట్ అందుకున్న ఆమెకు ఈ సక్సెస్ పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయింది. ఈ మూవీ హిట్ తర్వాత కూడా ఆమెకు ఆఫర్స్ రాకపోవడంతో తమిళ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. అక్కడ కొన్ని చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అవి సక్సెస్ సాధించలేదు. అయితే ఈ భామ కెరీర్లో హిట్స్ కంటే ప్లాప్సే ఎక్కువ. అయినప్పటికీ వెండితెరపై కనిపించిన ప్రతిసారి తన గ్లామర్, అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అదే క్రేజ్ కారణంగా తెలుగులో ఆమెకు మళ్లీ అవకాశాలు వరించాయి. హరి హర వీరమల్లు చిత్రంలో గట్టి కంబ్యాక్ ఇచ్చింది. రీఎంట్రీతోనే రెండు పాన్ ఇండియా సినిమాలకు కమిటైంది. అందులో వీరమల్లు రిలీజ్ అవ్వగా.. ప్రభాస్ రాజా సాబ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ని జరుపుకుంటోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఏంటి అది ప్రయివేట్ కారా ?
పాపం ఎంత ఆడుకున్నార్రా… మార్నింగ్ నుంచి #NidhiAgerwal #PawanKalyan #DCMPawanKalyan@AgerwalNidhhi @PawanKalyan pic.twitter.com/ab7BOk7ZOo
— Megha (@MovieloverMegha) August 11, 2025