E-Paper
Advertisement

The Raja Saab Controversy: రాజా సాబ్ టికెట్ గందరగోళం వెనుక పెద్ద కుట్ర ఉందా..?

The Raja Saab Controversy: రాజా సాబ్ టికెట్ గందరగోళం వెనుక పెద్ద కుట్ర ఉందా..?
Advertisement

The Raja Saab Controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ అంటే ఎప్పుడూ భారీ అంచనాలే. ఈ ఏడాది కూడా సంక్రాంతికి దాదాపు ఐదు సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే అందులో స్టార్ హీరోల సినిమాలు.. మాత్రం రెండు ఉన్నాయి. ఒకటి చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కాగా.. మరోటి ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్.

ప్రభాస్ సినిమా జనవరి 9న విడుదల కాగా చిరంజీవి సినిమా జనవరి 12న విడుదలవుతోంది. ఈ క్రమంలో ప్రభాస్ రాజా సాబ్ సినిమా టికెట్ ధరల విషయంలో భారీ గందరగోళం నెలకొంది. సినిమా విడుదలకు ముందు నుంచే టికెట్ రేట్లు.. పెంచుకునే అనుమతులపై స్పష్టత లేకపోవడం వల్ల ప్రీమియర్ షోలు..మొదటి రోజు కలెక్షన్లపై ప్రభావం పడిందనే అభిప్రాయం వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఒక రకంగా తెలంగాణలో టికెట్ రేట్ వివాదం లేకుంటే ఈ సినిమా ప్రీమియర్లకు మరిన్ని కలెక్షన్స్ వచ్చి ఉంటాయి. ఈ నేపథ్యంలో..ఈ వ్యవహారం ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.

Advertisement

వైరల్ అవుతున్న వార్తల ప్రకారం..ఒకే రోజు రెండు సినిమాలకు.. అనగా మన శంకర్ వరప్రసాద్ గారు అలానే రాజా సాబ్ రెండు సినిమాలకు.. సంబంధించిన మెమోలు తయారైనప్పటికీ.. ప్రభాస్ సినిమా రాజా సాబ్ మెమోను చివరి వరకూ ఆపి ఉంచారని ప్రచారం జరుగుతోంది. చిరంజీవి సినిమా కోసం జనవరి 8న తయారు చేసిన మెమోను.. కూడా బయటకు విడుదల చేయకుండా 10వ తేదీ వరకు నిలిపి ఉంచారని సమాచారం. దీనివల్ల ముందే విడుదలైన ప్రభాస్ సినిమా జీవోపై మాత్రమే కోర్టులో స్టే పడింది. అదే సమయంలో సంక్రాంతి సెలవుల కారణంగా చిరంజీవి.. సినిమా మెమోపై స్టే పడే అవకాశం లేకుండా పోయిందని చెబుతున్నారు.

మన శంకర్ వరప్రసాద్ కోసం..!

ఇంకా కొందరు..మన శంకర్ వరప్రసాద్ సినిమాకు అనుకూలంగా ఉండేందుకు రాజా సాబ్ సినిమాను కావాలనే బలి చేశారనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో షాడో సినిమాటోగ్రఫీ మంత్రి రోహిణ్ రెడ్డి పాత్ర ఉందని కూడా కొందరు విమర్శిస్తున్నారు. చిరంజీవి సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ 8వ తేదీన మెమో సిద్ధం చేసినా..బయటకు రానివ్వలేదని సినీ వర్గాలు అంటున్నాయి.

Advertisement

అదే సమయంలో ప్రభాస్ రాజా సాబ్ సినిమాకు మాత్రం అర్ధరాత్రి జీవో విడుదల చేసి టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైకోర్టు సెలవులు ఉన్న సమయంలోనే చిరంజీవి సినిమా మెమోను విడుదల చేశారని.. ఇలా చేయడం వెనుక వ్యూహం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే ప్రభాస్‌పై ఇలా వివక్ష చూపడం ఎందుకని ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఇండస్ట్రీలో రాజకీయాలు ఎంత ప్రభావం చూపుతున్నాయో మరోసారి బయటపెట్టిందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

ALSO READ: Anil Ravipudi: ఆ క్షణాలు జీవితంలో మర్చిపోలేను ..  భగవంత్ కేసరి పై అనిల్ కామెంట్స్!

Related News

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×