E-Paper
Advertisement

The Raja Saab -MSVPG films: ఏపీలో ప్రభాస్, చిరు సినిమాలకు పెరిగిన ప్రీమియర్ టికెట్ ధరలు

The Raja Saab -MSVPG films: ఏపీలో ప్రభాస్, చిరు సినిమాలకు పెరిగిన ప్రీమియర్ టికెట్ ధరలు
Advertisement

The Raja Saab -MSVPG: సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇక ఈ ఏడాదిలో చిరంజీవి(Chiranjeevi), ప్రభాస్(Peabhas) సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే 11వ తేదీ నుంచి ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. మరోవైపు ప్రభాస్ హీరోగా నటిస్తున్న ది రాజా సాబ్ (The Raja Saab)సినిమా జనవరి 9వ తేదీ విడుదల కాగా 8వ తేదీ సాయంత్రం నుంచి ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి.

గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..

ఇలా ఈ సినిమా ప్రీమియర్లకు టికెట్ ధరలు పెంచాలనే ఆలోచనలో రెండు సినిమాల నిర్మాతలు కూడా ఉన్నారు. ఈ విషయంలో తెలంగాణలో హైకోర్టుకు వెళ్ళగా హైకోర్టు సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇక ఏపీలో కూడా ఈ సినిమాకు ప్రీమియర్ టికెట్ ధరలను పెంచమని ప్రభుత్వాన్ని కోరడంతో ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీలో 8వ తేదీ రాజా సాబ్ సినిమా ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి అయితే ప్రీమియర్లకు ఒక్కో టికెట్ చొప్పున 1000 రూపాయలను పెంచడానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక తొమ్మిదవ తేదీ నుంచి ఈ సినిమా టికెట్ ధరలు రూ.250 చొప్పున అందుబాటులోకి రానున్నాయి.

పెరిగిన ప్రీమియర్ టికెట్ ధరలు..

Advertisement

ఇక చిరంజీవి అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా ప్రీమియర్లు 11వ తేదీ ప్రసారం కానున్నాయి. ఈ ప్రీమియర్లకు 500 రూపాయలు చొప్పున టికెట్ ధరలను పెంచడానికి ఏపీ సర్కార్ అనుమతి తెలిపింది. ఇక ఈ సినిమా 12వ తేదీ విడుదల కాగా రూ. 250 లకు ఏపీ ప్రభుత్వం అనుమతి తెలిపిందని తెలుస్తోంది. ఈ రెండు సినిమాల ప్రీమియర్లకు టికెట్ల ధరలు పెంచడానికి ఏపీ సర్కార్ అనుమతి తెలపడంతో చిత్ర నిర్మాతలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

భారీ అంచనాల నడుమ..

Advertisement

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు .ఈ సినిమా కోసం సుమారు 450 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది. చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా విషయానికి వస్తే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు షైన్ స్క్రీన్ బ్యానర్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో అంచనాల నడుమ సంక్రాంతి బరిలో దిగబోతున్న ఈ సినిమాలు ఎలాంటి సక్సెస్ అందుకుంటాయో తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాలో నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలను పెంచేశాయి.

Also Read: Sankranthi 2026 Movies: సంక్రాంతి బాక్సాఫీస్ వార్.. సైలెంట్ మోడ్‌లో ఆ ఇద్దరు హీరోల సినిమాలు

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×