E-Paper
Advertisement

Trivikram: ఇద్దరు స్టార్ హీరోలతో త్రివిక్రమ్ మాస్టర్ గారు.. ఇది సాధ్యమేనా గురూజీ..!

Trivikram: ఇద్దరు స్టార్ హీరోలతో త్రివిక్రమ్ మాస్టర్ గారు.. ఇది సాధ్యమేనా గురూజీ..!
Advertisement

Trivikram NTR Movie: తెలుగు ఇండస్ట్రీలో కొన్ని హీరో డైరెక్టర్ కాంబోలు ఎప్పటికీ ఫ్యాన్స్ కి ఫేవరేట్ గానే ఉంటాయి. అలాంటి వాటిలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ ఒకటి, అలాగే ఎన్టీఆర్ త్రివిక్రమ్ ఒకటి. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఒకే స్క్రిప్ట్ ఉండటంతో ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అదే గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా. మొదట ఈ స్క్రిప్ట్‌ను త్రివిక్రమ్ అల్లు అర్జున్‌ను దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేశారని ఇండస్ట్రీలో టాక్. కానీ ఆ సమయంలో అల్లు అర్జున్, అట్లీతో సినిమా చేయడానికి ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పక్కకు వెళ్లింది.

ఆ తర్వాత త్రివిక్రమ్ అదే కథను ఎన్టీఆర్‌కు వినిపించగా, తార నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని ప్రచారం జరిగింది.
అయితే టైమ్ గడిచేకొద్దీ పరిస్థితులు మారాయి. అల్లు అర్జున్ స్క్రిప్ట్ విన్న తర్వాత మళ్ళీ ఇంప్రెస్ అయ్యాడని, ఈ కథ తనతో చేస్తే భారీ స్థాయిలో వర్క్ అవుతుందని ఫీల్ అయ్యాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ మళ్లీ అల్లు అర్జున్ క్యాంప్‌కి వచ్చేసింది.

Advertisement

ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒకవైపు ఎన్టీఆర్‌తో కమిట్ అయిన స్క్రిప్ట్, మరోవైపు అల్లు అర్జున్ చూపిస్తున్న ఇంట్రెస్ట్. దీనివల్ల త్రివిక్రమ్ ముందు ఒక కొత్త ప్రాబ్లం ఏర్పడింది. ఎందుకంటే ఎన్టీఆర్ త్రివిక్రమ్ మధ్య బంధం కూడా చాలా కాలం నాటిది. త్రివిక్రమ్ కెరీర్‌లో కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఆయనకు అండగా నిలబడి అరవింద సమేత వీర రాఘవ సినిమా చేశాడు. ఆ విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు.
మరోవైపు అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోకి అద్భుతమైన బాక్సాఫీస్ ట్రాక్ రికార్డ్ ఉంది. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురములో లాంటి హిట్లు వేరే కాంబోలో సాధ్యమే అయ్యేవి కావేమో. అందుకే త్రివిక్రమ్ ఎవరి వైపు వెళ్లినా మరోకరు నిరాశ పడాల్సిందే.

తాజా సమాచారం ప్రకారం, త్రివిక్రమ్ ఈ సమస్యకు ఒక పరిష్కారం చూశాడట. ‘గాడ్ ఆఫ్ వార్’ స్క్రిప్ట్‌ను పూర్తిగా పక్కన పెట్టి, అల్లు అర్జున్‌తో ఒక కొత్త కథ, ఎన్టీఆర్‌తో మరో కొత్త కథ చేయాలనే ఆలోచన చేశారట. ఇలా చేస్తే ఇద్దరు హీరోలు కూడా హ్యాపీగా ఉంటారని త్రివిక్రమ్ ప్లాన్. మరి దీనికి ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఒప్పుకుంటారో లేదో చూడాలి.

Advertisement

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో భారీ ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నారు. పుష్ప 2 తర్వాత ఆయన మార్కెట్ పాన్ ఇండియా స్థాయికి వెళ్లడంతో ప్రతి సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ విషయానికి వస్తే, ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ అనే భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల మీద ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ హైప్ ఉంది.

ALSO READ: Balakrishna: అఖండ 2 నష్టాల విషయంలో బయర్లతోపాటు.. అతని కలవనున్న బోయపాటి..!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×