The Raja Saab Producer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘ది రాజా సాబ్’పై కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. 2026 జనవరి 9న విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్, ఓటీటీ డీల్కి సంబంధించి తరచూ రూమర్స్ వార్తల్లో నిలుస్తున్నాయి. ది రాజా సాబ్ అంచనాల తగ్గట్టుగా బిజినెస్ జరగడం లేదని, ముఖ్యంగా ఓవర్సిస్లో అసలు ఈ చిత్రాన్ని పట్టించుకునేవారు లేరంటూ రోజుకో వార్త వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ రూమర్స్ స్వయంగా నిర్మాత స్పందించారు.
ఈ మేరకు ఆయన ఎక్స్లో ఓ పోస్ట్ షేర్ చేశారు. రాజా సాబ్ లెక్కలు మా అంతర్గతమని, అవి మీకేందుకు చెప్పాలంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా హారర్ కామెడీ థ్రిల్లర్గా ఈ ది రాజా సాబ్ మూవీ తెరకెక్కింది. పిపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలతో పాటు ప్రమోషనల్ ఈవెంట్స్ ని జరుపుకుంటుంది. ఓ వైపు విడుదల తేదీ దగ్గరపడుతుంటే మరోవైపు మూవీ లెక్కలపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ప్రభాస్ సినిమా కావడంతో ది రాజాసాబ్ బిజినెస్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఫ్యాన్స్, ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో మూవీని ప్రీ రిలీజ్, నాన్ థియేట్రికల్ బిజినెస్కు పెద్దగా రెస్పాన్స్ రావడం లేదని. ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదని నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి. ఓటీటీ డీల్తో పాటు ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అంచనాలు అందుకోలేకపోతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా రిలీజ్ ముందే ది రాజా సాబ్పై నెగిటివీ ప్రచారం జరగడంతో స్వయంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ రంగంలోకి దిగారు. “మా అతిపెద్ద సినిమా ‘ది రాజా సాబ్‘ అంతర్గత లెక్కల గురించి బయటికి చెప్పలేము.
Also Read: Subhashree Rayaguru: శుభ శ్రీకి ప్రియుడి సర్ప్రైజ్.. మరో లగ్జరీ కారు గిఫ్ట్.. ధరేంతంటే!
థియేటర్లలో రిలీజ్ తర్వాత మా సినిమాకు వచ్చే లెక్కలను అఫీషియల్గా ప్రకటిస్తాం. సినిమా రంగం అనేది దశలవారీగా మారుతూ ఉంటుంది. ఈ రోజుల్లో నాన్-థియేట్రికల్ మార్కెట్లో సాధారణంగా సర్దుబాట్లు జరుగుతుంటాయి. థియేటర్లలో మాత్రమే అసలైన నంబర్స్ వస్తాయి. అయినప్పటికీ కూడా మా సినిమా ఈ రోజు అత్యధిక నాన్-థియేట్రికల్ విలువను సాధించింది. ‘ అని ఆయన పేర్కొన్నారు. అలాగే ది రాజాసాబ్కు పోలికలు అనవసరమంటూ రూమర్స్పై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళివిక మోహనన్, రిద్ది కుమార్లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ దిగ్గజ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
There’s a lot of noise around the business of our biggest film.
We don’t discuss internal spends or numbers publicly. What truly matters to us and the fans is the theatrical impact. Post release, we will officially share the worldwide box-office figures.
Cinema moves in phases.…
— Vishwa Prasad (@vishwaprasadtg) December 21, 2025