E-Paper
Advertisement

Naga Chaithanya – Sobhitha : జగన్నాథుని సన్నిధిలో చైతూ -శోభిత జంట.. వీడియో వైరల్..

Naga Chaithanya – Sobhitha : జగన్నాథుని సన్నిధిలో చైతూ -శోభిత జంట.. వీడియో వైరల్..
Advertisement

Naga Chaithanya – Sobhitha : టాలీవుడ్ క్రేజీ హీరో యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాడు.. ఒకవైపు వరుసగా హిట్ సినిమాలలో నటిస్తున్న ఈయన ప్రస్తుతం బ్యాడ్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టుకుంటూ బిజీగా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన సినిమాలు ను డిఫరెంట్ స్టోరీలతో వస్తున్నాయి. గతంలో వచ్చిన తండేల్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు హీరో నాగచైతన్య. ఇదిలో ఉండగా ఆయన తన భార్యతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నాడు.. తాజాగా నాగచైతన్య శోభిత దూళిపాళ్ల ఓ టెంపుల్ లో కనిపించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. ఇంతకీ వాళ్ళిద్దరూ ఎక్కడ ప్రత్యక్షమయ్యారు అన్నది మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

పూరి జగన్నాథుని సన్నిధిలో చై – శోభిత..

టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ జంట నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ళ ఇద్దరు కూడా ప్రముఖ ఆలయాలను సందర్శిస్తూ దైవచింతనలో మునిగిపోయారు.. ఈమధ్య వీరిద్దరూ కూడా సినిమాలకు సమయం దొరికితే చాలు గుడులు గోపురాలు అంటూ తిరుగుతున్నారు.. అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడో ఒక చోట కెమెరాలకు చిక్కుతూనే ఉన్నారు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు బయటకు వస్తున్నాయి.. తాజాగా వీరిద్దరూ కలిసి గుజరాత్ లోని ప్రముఖ పూరి జగన్నాథుని ఆలయాన్ని సందర్శించారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.. తెల్ల చొక్కా పంచలో నాగచైతన్య కనిపించగా, ఎర్రని చీరలో శోభిత అందంగా కనిపిస్తుంది. అక్కడ దేవుడిని దర్శించుకున్నారు. వీరిద్దరికి ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు కల్పించారు. ఆ వీడియోను ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..

Advertisement

Also Read :బాలు ప్లాన్ గ్రాండ్ సక్సెస్.. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావే.. మరోసారి మోసపోయిన మనోజ్..

ప్రస్తుతం సినిమాల విషయానికొస్తే.. 

గత ఏడాది నాగ చైతన్య తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. తాజాగా ఈయన వృషకర్మ అనే సినిమాలో నటిస్తున్నాడు.. వృషకర్మ మూవీకి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో చైతన్యకు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. అలాగే ఇందులో జయరామ్, స్పర్ష్ శ్రీవాస్తవ, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.. అటు శోభిత కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. బాలీవుడ్ లో ఈమె చేస్తున్న సినిమాలు మంచి క్రేజ్ ని సంపాదించుకుంటున్నాయి.. ప్రస్తుతం వీరిద్దరూ కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.. ఇక నాగచైతన్య వచ్చేయడాది మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టారు.. సోషల్ మీడియాలో మాత్రం శోభిత తల్లి కాబోతోంది అంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే అందులో నిజం లేదని తెలుస్తుంది.

Advertisement

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×