E-Paper
Advertisement

Film industry: నిర్మాతలుగా మారిన సెలబ్రిటీ సిస్టర్స్.. ఎవరెవరంటే?

Film industry: నిర్మాతలుగా మారిన సెలబ్రిటీ సిస్టర్స్.. ఎవరెవరంటే?
Advertisement

Film industry:ఈమధ్యకాలంలో సెలబ్రిటీల వారసులు సినీ ఇండస్ట్రీలో ఉండే 24 శాఖలలో ఏదో ఒక శాఖలో సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది హీరోలుగా.. మరికొంతమంది హీరోయిన్లుగా సెటిల్ అవుతుంటే ఇంకొంతమంది సెలబ్రిటీల వారసులు మాత్రం డైరెక్షన్, ప్రొడక్షన్ విభాగంలో సెటిల్ అవుతూ సక్సెస్ అందుకుంటున్నారు. ఇంకొంతమంది ఇండస్ట్రీకి దూరంగా వ్యాపారాలు చేసుకుంటూ కెరియర్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఒక సెలబ్రిటీకి ఇద్దరు పిల్లలు ఉంటే.. వారిద్దరూ వేరువేరు రంగాలలో కొనసాగుతున్నారు. కానీ ఇక్కడ కొంతమంది సెలబ్రిటీలకు చెందిన వారసురాళ్లు మాత్రం నిర్మాతలుగా కొనసాగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మరి నిర్మాతలుగా కొనసాగుతున్న ఆ సెలబ్రిటీ సిస్టర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

వరలక్ష్మీ శరత్ కుమార్ – పూజా శరత్ కుమార్:

విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఇప్పుడు దర్శకురాలిగా మారిన విషయం తెలిసిందే. ఈమె స్వీయ దర్శకత్వంలో సోదరీ పూజా శరత్ కుమార్ తో కలిసి ‘సరస్వతి’ అనే న్యూ ఏజ్ థ్రిల్లర్ ను రూపొందిస్తున్నారు. పైగా ఈ చిత్రానికి వీరిద్దరూ నిర్మాతలు కూడా.. అలా వీరిద్దరూ కలిసి నిర్మాతలుగా మారారు. ఇప్పుడు సరస్వతి అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. జీవ , ప్రకాష్ రాజ్ , ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా హై కాన్సెప్ట్ మూవీ అని వరలక్ష్మి కూడా చెప్పుకొచ్చింది త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాతలుగా తొలి ప్రయత్నం చేస్తున్న ఈ సినిమా వీరికి ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.

ప్రియాంక దత్ – స్వప్న దత్:

Advertisement

ప్రముఖ బడా నిర్మాత అశ్వినీ దత్ వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు స్వప్న దత్, ప్రియాంక దత్. దత్ సిస్టర్స్ అయిన వీరు స్వప్న సినిమాస్, వైజయంతి బ్యానర్లపై పలు చిత్రాలను నిర్మించి సక్సెస్ఫుల్ లేడీ ప్రొడ్యూసర్స్ గా మంచి పేరు దక్కించుకున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, జాతి రత్నాలు, సీతారామం, అన్నీ మంచి శకునములే, కల్కి 2898AD, ఛాంపియన్ వంటి చిత్రాలను సంయుక్తంగా నిర్మించి మంచి పేరు దక్కించుకున్నారు.

అలా నిర్మాతలుగా ఈ సిస్టర్స్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్, పూజా శరత్ కుమార్ సిస్టర్స్ కూడా నిర్మాతలుగా తొలి ప్రయత్నం చేస్తున్నారు. మరి వీరు గనుక సక్సెస్ అయితే ఈ జాబితాలోకి ఇంకొంతమంది సెలబ్రిటీ సిస్టర్స్ నేతలుగా అడుగుపెట్టే అవకాశాలు లేకపోలేదని చెప్పవచ్చు.

Advertisement

ALSO READ:Maa Inti Bangaram: రెండో పెళ్లి తర్వాత… సమంత కం బ్యాక్ మూవీ ట్రైలర్ వచ్చేస్తోంది

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×