CSK-Mustafizur Rahman: ఇండియా, బంగ్లాదేశ్ మధ్య రోజు రోజుకు పరిస్థితులు క్షీణించుకుపోతున్నాయి. పాకిస్తాన్ లాగానే బంగ్లాదేశ్ కూడా ఇండియాకు దూరం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇంత జరుగుతున్న బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు మాత్రం ఆగడం లేదు. రోజుకొకరిని లెక్కన హతమార్చుతున్నారు బంగ్లాదేశ్ ముస్లింలు. అయితే ఇలాంటి నేపథ్యంలో ముస్తాఫిజుర్ రహమాన్ ను ( CSK-Mustafizur Rahman ) ఐపీఎల్ ఆడకుండా బ్యాన్ విధించింది బీసీసీఐ. దీంతో ఐపీఎల్ ప్రసారాలు తమ దేశంలో నిలిపివేస్తున్నట్లు అటు బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా కీలక ప్రకటన చేసింది. ఇంత రాద్దాంతం జరుగుతున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఆ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై దేశద్రోహి అంటూ ముద్రవేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు.
Also Read: Sara Tendulkar: సచిన్ ఘోర అవమానం..కూతురు సారా ఫోటోలు అసభ్యకరంగా తీసి, వేధింపులు ?
ముస్తాఫిజుర్ రహమాన్ ( Mustafizur Rahman ) ఎపిసోడ్ కొనసాగుతున్న నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ పై దేశద్రోహి ముద్ర వేసి రచ్చ రచ్చ చేస్తున్నారు. దీనికి ప్రత్యేక కారణం ఉంది. బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ పై భారత క్రికెట్ నియంత్రణ మండలి వేటు వేసినప్పటికీ, చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai super kings) మాత్రం తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. ఇప్పటికీ కూడా ఆ బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ ను సోషల్ మీడియాలో ఫాలో అవుతోంది చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెట్టిజెన్స్. ఇంత జరుగుతున్నా ఆ దుర్మార్గుడిని ఎందుకు ఫాలో అవుతున్నారని చెన్నై సూపర్ కింగ్స్ జట్టును నిలదీస్తున్నారు. మీరు దేశ ద్రోహులు అంటూ ఫైర్ అవుతున్నారు. వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కూడా బ్యాన్ చేయండి అంటూ బీసీసీఐ ని కోరుతున్నారు.
బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ ఐపిఎల్ 2024 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆ జట్టులో కీలక ప్లేయర్ గా కొనసాగాడు. మహేంద్ర సింగ్ ధోనీ ఇచ్చే సలహాలు తీసుకొని అద్భుత ప్రదర్శన కనబరిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున 9 మ్యాచ్ లు ఆడిన ముస్తాఫిజుర్ రహమాన్ 14 వికెట్లు తీసి అదరగొట్టాడు. అయితే ఆ తర్వాత 2025 వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ లోకి జంప్ అయ్యాడు. కానీ ఆ జట్టులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక మొన్నటి మినీ వేలంలో 9.20 కోట్లకు బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ ను కొనుగోలు చేసింది కేకేఆర్ యాజమాన్యం. అయితే ఇప్పుడు బంగ్లా క్రికెటర్ల పై విమర్శలు రావడంతో అతనిపై వేటువేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.
Csk still following him .
Shameless Franchise 🤦 pic.twitter.com/IGSfpXbdkt
— innings ➊➑➌ (@183innings2012) January 6, 2026