Vijay Devarakonda in Spirit: ప్రస్తుతం టాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అర్జున్ రెడ్డి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందా..అనే ప్రశ్న అభిమానుల్లో ఉత్సుకతను పెంచుతోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కార్యాలయంలో విజయ్ దేవరకొండ కనిపించడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి.
అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ను పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ద్వారా ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అదే విధంగా సందీప్ రెడ్డి వంగా కూడా టాప్ డైరెక్టర్ల లిస్ట్లో చేరారు. ఆ కాంబో మళ్లీ వస్తే మరోసారి సంచలనం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
ఇటీవల విజయ్ దేవరకొండ.. సందీప్ రెడ్డి వంగా ఆఫీస్కి వెళ్లిన విషయం బయటకు రావడంతో కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఉంటుందేమో అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయినా సోషల్ మీడియాలో మాత్రం రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
వాటిలో ఒక ముఖ్యమైన రూమర్ ఏమిటంటే..సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ స్పిరిట్ సినిమాలో విజయ్ దేవరకొండ కీలక పాత్రలో కనిపించవచ్చని. ఈ సినిమా హీరోగా ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. యానిమల్ తర్వాత సందీప్ చేస్తున్న ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ప్రభాస్ విషయానికి వస్తే.. ఇటీవల వచ్చిన ‘రాజా సాబ్’ సినిమా పెద్దగా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అందుకే ప్రభాస్ అభిమానులు అందరూ స్పిరిట్ మీద భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో కథ, క్యారెక్టర్లు చాలా పవర్ఫుల్గా ఉంటాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
మరోవైపు విజయ్ దేవరకొండ కూడా వరుసగా సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో.. ఆయన కెరీర్లో ఒక బలమైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. అలాంటి సమయంలో సందీప్ రెడ్డి వంగా సినిమాతో మళ్లీ కనిపిస్తే అది పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొందరు అయితే విజయ్ దేవరకొండ ఒక కేమియో పాత్రలో అయినా కనిపించవచ్చని ఊహిస్తున్నారు.
ఇవి అన్నీ ఇప్పటికీ రూమర్స్ మాత్రమే. అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. అయినా ‘అర్జున్ రెడ్డి’ కాంబో మళ్లీ వస్తుందా లేదా అనే ఆసక్తి మాత్రం టాలీవుడ్లో రోజురోజుకీ పెరుగుతోంది. మరి సందీప్ రెడ్డి ఈ విషయం గురించి అధికారిక ప్రకటన ఇస్తారేమో వేచి చూడాలి.
ALSO READ: Sobhita dhulipala: జనాల గురించి ఆలోచిస్తే నా వ్యక్తిత్వం కోల్పోతాను -శోభిత