E-Paper
Advertisement

Ayan Mukerji: వార్ 2 ఎఫెక్ట్ ధూమ్ 4 నుంచి డైరెక్టర్ ఔట్…ఆశలు మొత్తం ఆ సినిమాపైనే?

Ayan Mukerji: వార్ 2 ఎఫెక్ట్ ధూమ్ 4 నుంచి డైరెక్టర్ ఔట్…ఆశలు మొత్తం ఆ సినిమాపైనే?
Advertisement

Ayan Mukerji: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో అయాన్ ముఖర్జీ(Ayan Mukerji) ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకుడుగా వ్యవహరించిన ఈయన తాజాగా యశ్ రాజ్ ఫిలిం యూనివర్స్ నుంచి వచ్చిన వార్ 2(War 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan)నటించారు. అదేవిధంగా టాలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ (NTR)కూడా ఈ సినిమాలో భాగమైన సంగతి తెలిసిందే.

ధూమ్ 4 నుంచి తప్పుకున్న అయాన్..

ఇలా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నటించిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా విడుదలైన అనంతరం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. తద్వారా దర్శకుడు అయాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే యశ్ రాజ్ ఫిలిం యూనివర్స్ లో భాగమైన ధూమ్ 4 (Dhoom 4)నుంచి ఈయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే వార్ 2 ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోని నేపథ్యంలో దర్శకుడు ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

రామాయణ పనులలో రణబీర్..

Advertisement

ఇలా అయాన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈయన బ్రహ్మాస్త్ర 2 (Brahmastra2)సినిమాపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారని తెలుస్తుంది. ఈ సినిమాని 2026 సంవత్సరంలో సెట్స్ పైకి తీసుకువెళ్లాలనే ఆలోచనలో అయాన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇదివరకే ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతుందని ఇదివరకే చిత్ర బృందం ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది.

బ్రహ్మాస్త్ర 2 ..

Advertisement

ఇక బ్రహ్మాస్త్ర సినిమాలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ , అలియా భట్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ హీరో నాగార్జున కూడా కీలకపాత్రలో నటించారు. ఇక ఈ సినిమా తెలుగులో విడుదలయ్యి ఇక్కడ కూడా ఇంత మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం రణబీర్ కపూర్ రామాయణ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతుంది. రామాయణ సినిమా మొదటి భాగం 2026 దీపావళి పండుగను పురస్కరించుకొని విడుదల కాబోతోంది. ఈ సినిమా అనంతరం రణబీర్ బ్రహ్మాస్త్ర 2 సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. ఇక అలియా భట్ కూడా ప్రస్తుతం పలు సినిమా పనులలో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఆల్ఫా అనే సినిమా ద్వారా ఈమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Also Read: Jayammu Nischayammuraa: ఆ హీరోయిన్ కోసం పడి దొర్లిన జగపతి బాబు.. పరువు మొత్తం తీసిందిగా?

Related News

చెప్పినట్టే వచ్చాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న జననాయగన్ షార్ట్ వీడియో వైరల్!

‘గాడ్ ఆఫ్ వార్’లో ఎన్టీఆర్‌తో నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

Big Stories

Advertisement
×