E-Paper
Advertisement

Encounter: ఛత్తీస్‌గడ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

Encounter: ఛత్తీస్‌గడ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

 

Encounter: ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య మరోసారి కాల్పుల యుద్ధం చోటుచేసుకుంది. కాంకేర్, నారాయణ్‌పుర్ జిల్లాల సరిహద్దుల్లో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ భారీ ఎన్ కౌంటర్ లో పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది నక్సలైట్లను హతం చేశారు. మహారాష్ట్ర సరిహద్దులో మావోయిస్టులు ఉన్నట్లు అందిన సమాచారంతో భద్రతా సిబ్బంది ఈ భారీ ఆపరేషన్ చేపట్టింది.

స్పెషల్ టాస్క ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గ్రూప్ డీఆర్‌జీ దళాలు చేపట్టిన ఆపరేషన్ లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో మరణించారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బందికి ఎటువంటి గాయాలపాలు కాలేదని తెలిపారు. అయితే ఘటన స్థలంలో ఏకే 47 తుపాకీ, మరిన్ని ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో మొత్తం 10 మంది నక్సలైట్లు మరణించినట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది భద్రతా సిబ్బంది, మావోల మధ్య జరిగిన కాల్పుల్లో పెద్ద ఎత్తున మావోలు మరణించారు.

ఏప్రిల్ 16వ తేదీన జరిగిన ఎన్ కౌంటర్ లో 29 మంది మావోయిస్టులు మరణించగా.. మొత్తం ఈ ఏడాది బస్తర్ అడవుల్లో 90 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు.

 

Tags

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×