Big Stories

Encounter: ఛత్తీస్‌గడ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి

 

- Advertisement -

Encounter: ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య మరోసారి కాల్పుల యుద్ధం చోటుచేసుకుంది. కాంకేర్, నారాయణ్‌పుర్ జిల్లాల సరిహద్దుల్లో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ భారీ ఎన్ కౌంటర్ లో పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది నక్సలైట్లను హతం చేశారు. మహారాష్ట్ర సరిహద్దులో మావోయిస్టులు ఉన్నట్లు అందిన సమాచారంతో భద్రతా సిబ్బంది ఈ భారీ ఆపరేషన్ చేపట్టింది.

- Advertisement -

స్పెషల్ టాస్క ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గ్రూప్ డీఆర్‌జీ దళాలు చేపట్టిన ఆపరేషన్ లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో మరణించారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బందికి ఎటువంటి గాయాలపాలు కాలేదని తెలిపారు. అయితే ఘటన స్థలంలో ఏకే 47 తుపాకీ, మరిన్ని ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో మొత్తం 10 మంది నక్సలైట్లు మరణించినట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది భద్రతా సిబ్బంది, మావోల మధ్య జరిగిన కాల్పుల్లో పెద్ద ఎత్తున మావోలు మరణించారు.

ఏప్రిల్ 16వ తేదీన జరిగిన ఎన్ కౌంటర్ లో 29 మంది మావోయిస్టులు మరణించగా.. మొత్తం ఈ ఏడాది బస్తర్ అడవుల్లో 90 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News