E-Paper
Advertisement

India vs Sri Lanka: సూర్య మెరుపులు..శ్రీలంకపై భారత్ ఘన విజయం

India vs Sri Lanka: సూర్య మెరుపులు..శ్రీలంకపై భారత్ ఘన విజయం

India beat Sri Lanka by 43 runs in Pallekele: శ్రీలంక పర్యటనను భారత్ విజయంతో ప్రారంభించింది. శ్రీలంకతో పల్లెకెలెలో జరిగిన తొలి మ్యాచ్‌లో 43 పరుగుల భారీ తేడాతో భారత్ గెలుపొందింది. మూడు టీ20 సిరీస్‌లో భాగంగా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. సూర్య కుమార్ యాదవ్ 26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 58 పరుగులు చేయగా..రిషభ్ పంత్ 33 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 49, యశస్వి జైస్వాల్ 21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40, శుభమన్ గిల్ 16 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 34 పరుగులు చేసి శ్రీలంక ముందు భారీ స్కోరు ఉంచారు. లంక బౌలర్లలో పతిరన నాలుగు వికెట్లు తీశాడు.

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ అయింది. మొదట ఓపెనర్లు దూకుడుగా ఆడారు. నిశాంక 48 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 79 పరుగులు, కుశాల్ మెండీస్ 27 బంతుల్లో 7 ఫోర్లు సిక్స్‌తో 45 పరుగులు చేశారు. శ్రీలంక స్కోరు 84 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత వచ్చిన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. చివరి ఓవరల్లో తడబడి ఓటమి పాలయ్యారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు, రియాన్ సింగ్ మూడు, అర్షదీప్ రెండు వికెట్లు తీశారు.

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×