BigTV English

India vs Sri Lanka: సూర్య మెరుపులు..శ్రీలంకపై భారత్ ఘన విజయం

India vs Sri Lanka: సూర్య మెరుపులు..శ్రీలంకపై భారత్ ఘన విజయం

India beat Sri Lanka by 43 runs in Pallekele: శ్రీలంక పర్యటనను భారత్ విజయంతో ప్రారంభించింది. శ్రీలంకతో పల్లెకెలెలో జరిగిన తొలి మ్యాచ్‌లో 43 పరుగుల భారీ తేడాతో భారత్ గెలుపొందింది. మూడు టీ20 సిరీస్‌లో భాగంగా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.


టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. సూర్య కుమార్ యాదవ్ 26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 58 పరుగులు చేయగా..రిషభ్ పంత్ 33 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 49, యశస్వి జైస్వాల్ 21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40, శుభమన్ గిల్ 16 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 34 పరుగులు చేసి శ్రీలంక ముందు భారీ స్కోరు ఉంచారు. లంక బౌలర్లలో పతిరన నాలుగు వికెట్లు తీశాడు.

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ అయింది. మొదట ఓపెనర్లు దూకుడుగా ఆడారు. నిశాంక 48 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 79 పరుగులు, కుశాల్ మెండీస్ 27 బంతుల్లో 7 ఫోర్లు సిక్స్‌తో 45 పరుగులు చేశారు. శ్రీలంక స్కోరు 84 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత వచ్చిన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. చివరి ఓవరల్లో తడబడి ఓటమి పాలయ్యారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు, రియాన్ సింగ్ మూడు, అర్షదీప్ రెండు వికెట్లు తీశారు.


Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×