BigTV English
Advertisement

Coast Guard News: అరేబియా సముద్రంలో హెలికాప్టర్ క్రాష్, 40 రోజుల తర్వాత పైలట్ మృతదేహం లభ్యం

Coast Guard News: అరేబియా సముద్రంలో హెలికాప్టర్ క్రాష్, 40 రోజుల తర్వాత పైలట్ మృతదేహం లభ్యం

Coast Guard Helicopter Crash: సెప్టెంబర్ 2న పోరుబందర్ కు సుమారు 50 కిలో మీటర్ల దూరంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన పైలెట్ ఆర్‌కె రానా మృతదేహాన్ని తాజాగా అధికారులు గుర్తించారు. అక్టోబర్ 10న అరేబియా సముద్రంలో ఆయన డెడ్ బాడీని కనిపించినట్లు వెల్లడించారు. కోస్ట్ గార్డ్  హెలికాప్టర్ సాయంతో అతడి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చినట్లు ప్రకటించారు. ఈ ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో నలుగురు కోస్ట్ గార్డు సిబ్బంది ఉన్నారు. సెప్టెంబర్ 3న కమాండెంట్ విపిన్ బాబు, ప్రధాన్ నావిక్ కరణ్ సింగ్ మృతదేహాలను వెలికితీశారు. గౌతమ్ కుమార్ అనే కోస్ట్ గార్డ్ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. పైలెట్ రానా మృతదేహం మాత్రం లభించలేదు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రానా కోస్ట్ గార్డులో పైలెట్ గా పని చేస్తున్నారు.


సెప్టెంబర్ 2న ఏం జరిగిందంటే.

అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న వ్యాపార నౌకకు సంబంధించిన నావిక్ కు అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని భారత కోస్ట్ గార్డు అధికారులకు చేరవేశారు. వెంటనే నౌకలోని నావిక్ ను రక్షించడంతో పాటు ఆయన స్థానంలో కోస్ట్ గార్డు నావికులు వెళ్లి నౌకను తీరానికి తీసుకురావాలని భావించారు. అనుకున్నదే ఆలస్యంగా మొత్తం నలుగురు కోస్ట్ గార్డ్ సిబ్బంది హెలికాప్టర్ లో నౌక దగ్గరికి బయల్దేరారు. వారిలో ఇద్దరు పైలెట్లు, ఇద్దరు డైవర్లు ఉన్నారు. పోరుబందర్ కు సుమారు 50 కిలో మీటర్ల దూరం ప్రయాణించగానే హెలికాప్టర్ లో సాంకేతి లోపం తలెత్తింది. కాసేపు హెలికాప్టర్ ను గాల్లోనే చక్కర్లు కొట్టించారు పైలెట్లు. అయినప్పటికీ పరిస్థితి కంట్రోల్ కాలేదు. ఏం చేయాలో తెలియక, అరేబియా సముద్రంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. హెలికాప్ట్ లోని నలుగురు కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్రంలో మునిగిపోయారు.


భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన కోస్ట్‌ గార్డ్ సిబ్బంది

కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండిండ్ విషయం తెలియగానే సిబ్బందిని కాపాడేందుకు కోస్ట్ గార్డ్ అధికారులు రంగంలోకి దిగారు. గల్లంతైన ఇద్దరు హెలికాప్టర్ పైలెట్లతోపాటు ఇద్దరు డైవర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు నౌకలు, రెండు విమానాలతో ఈ ఆపరేషన్ చేపట్టారు. డైవర్లలో ఒకరిని ప్రాణాలతో కాపాడారు. ఓ పైలెట్, మరో డైవర్ మృతదేహాలను గుర్తించారు. ఆర్‌కె రానా డెడ్ బాడీ మాత్రం ఎంత వెతికినా కనిపించలేదు. కొద్ది రోజుల పాటు ఆయన బాడీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగించినా లాభం లేకపోయింది. తాజాగా కోస్ట్ గార్డు అధికారులు మరోసారి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆర్‌కె రానా మృతదేహాన్ని గుర్తించారు. హెలికాప్టర్ ప్రమాదం తర్వాత ఏకంగా 40 రోజులకు ఆయన డెడ్ బాడీని గుర్తించి బయటకు తీసుకొచ్చారు. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కోస్ట్ గార్డ్ అధికారులు వెల్లడించారు.

Read Also:గాడిద పాల పేరుతో రూ.10 కోట్ల మోసం, బాబోయ్.. ఇలా కూడా చెయ్యొచ్చా?

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×