E-Paper
Advertisement

Coast Guard News: అరేబియా సముద్రంలో హెలికాప్టర్ క్రాష్, 40 రోజుల తర్వాత పైలట్ మృతదేహం లభ్యం

Coast Guard News: అరేబియా సముద్రంలో హెలికాప్టర్ క్రాష్, 40 రోజుల తర్వాత పైలట్ మృతదేహం లభ్యం
Advertisement

Coast Guard Helicopter Crash: సెప్టెంబర్ 2న పోరుబందర్ కు సుమారు 50 కిలో మీటర్ల దూరంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన పైలెట్ ఆర్‌కె రానా మృతదేహాన్ని తాజాగా అధికారులు గుర్తించారు. అక్టోబర్ 10న అరేబియా సముద్రంలో ఆయన డెడ్ బాడీని కనిపించినట్లు వెల్లడించారు. కోస్ట్ గార్డ్  హెలికాప్టర్ సాయంతో అతడి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చినట్లు ప్రకటించారు. ఈ ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో నలుగురు కోస్ట్ గార్డు సిబ్బంది ఉన్నారు. సెప్టెంబర్ 3న కమాండెంట్ విపిన్ బాబు, ప్రధాన్ నావిక్ కరణ్ సింగ్ మృతదేహాలను వెలికితీశారు. గౌతమ్ కుమార్ అనే కోస్ట్ గార్డ్ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. పైలెట్ రానా మృతదేహం మాత్రం లభించలేదు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రానా కోస్ట్ గార్డులో పైలెట్ గా పని చేస్తున్నారు.

సెప్టెంబర్ 2న ఏం జరిగిందంటే.

Advertisement

అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న వ్యాపార నౌకకు సంబంధించిన నావిక్ కు అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని భారత కోస్ట్ గార్డు అధికారులకు చేరవేశారు. వెంటనే నౌకలోని నావిక్ ను రక్షించడంతో పాటు ఆయన స్థానంలో కోస్ట్ గార్డు నావికులు వెళ్లి నౌకను తీరానికి తీసుకురావాలని భావించారు. అనుకున్నదే ఆలస్యంగా మొత్తం నలుగురు కోస్ట్ గార్డ్ సిబ్బంది హెలికాప్టర్ లో నౌక దగ్గరికి బయల్దేరారు. వారిలో ఇద్దరు పైలెట్లు, ఇద్దరు డైవర్లు ఉన్నారు. పోరుబందర్ కు సుమారు 50 కిలో మీటర్ల దూరం ప్రయాణించగానే హెలికాప్టర్ లో సాంకేతి లోపం తలెత్తింది. కాసేపు హెలికాప్టర్ ను గాల్లోనే చక్కర్లు కొట్టించారు పైలెట్లు. అయినప్పటికీ పరిస్థితి కంట్రోల్ కాలేదు. ఏం చేయాలో తెలియక, అరేబియా సముద్రంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. హెలికాప్ట్ లోని నలుగురు కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్రంలో మునిగిపోయారు.

భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన కోస్ట్‌ గార్డ్ సిబ్బంది

Advertisement

కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండిండ్ విషయం తెలియగానే సిబ్బందిని కాపాడేందుకు కోస్ట్ గార్డ్ అధికారులు రంగంలోకి దిగారు. గల్లంతైన ఇద్దరు హెలికాప్టర్ పైలెట్లతోపాటు ఇద్దరు డైవర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు నౌకలు, రెండు విమానాలతో ఈ ఆపరేషన్ చేపట్టారు. డైవర్లలో ఒకరిని ప్రాణాలతో కాపాడారు. ఓ పైలెట్, మరో డైవర్ మృతదేహాలను గుర్తించారు. ఆర్‌కె రానా డెడ్ బాడీ మాత్రం ఎంత వెతికినా కనిపించలేదు. కొద్ది రోజుల పాటు ఆయన బాడీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగించినా లాభం లేకపోయింది. తాజాగా కోస్ట్ గార్డు అధికారులు మరోసారి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆర్‌కె రానా మృతదేహాన్ని గుర్తించారు. హెలికాప్టర్ ప్రమాదం తర్వాత ఏకంగా 40 రోజులకు ఆయన డెడ్ బాడీని గుర్తించి బయటకు తీసుకొచ్చారు. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కోస్ట్ గార్డ్ అధికారులు వెల్లడించారు.

Read Also:గాడిద పాల పేరుతో రూ.10 కోట్ల మోసం, బాబోయ్.. ఇలా కూడా చెయ్యొచ్చా?

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×