E-Paper
Advertisement

Assam Earthquake: అస్సాంలోని గౌహతిలో భూకంపం.. తీవ్రత సుమారు 5.8

Assam Earthquake: అస్సాంలోని గౌహతిలో భూకంపం.. తీవ్రత సుమారు 5.8

Assam Earthquake : అస్సాంలోని గౌహతిలో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు ఉత్తర బెంగాల్, భూటాన్ వరకు వ్యాపించాయి. దీని కేంద్రం ఉడల్‌గురి జిల్లాలో ఉందని అధికారుల తెలిపారు. భూకంపం తీవ్రత సుమారు 5.8 ఉన్నట్లు వెల్లడించారు. ఇవాళ సాయంత్రం 4:4ం గంటలకు భూకంపించినట్లు తెలిపారు. భూకంప తీవ్రతకు ఇళ్లు స్వల్పంగా ఊగాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనై బయటకు పరుగులు పెట్టారు. అయితే.. భూకంపం వలన ఇప్పటివరకు ఎవరికి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని అదికారులు పేర్కొన్నారు. ఇక్కడ ఈశాన్య ప్రాంతం భూకంప జోన్‌ గా తెలిపారు. అందువలన ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయని అధికారులు తెలిపారు.

పది రోజుల క్రితం అంటే, అసోంలోని సోనిత్‌పూర్‌లో సెప్టెంబరు 2న 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రస్తుత భూకంపం వల్ల ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లభించలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆదివారం అసోంలో ఉన్న సమయంలో భూకంపం సంభవించటంతో, అక్కడ ఆందోళన నెలకొంది.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×