E-Paper
Advertisement

PM Modi: సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌కు.. ప్రధానీ మోదీ నివాళి

PM Modi: సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌కు.. ప్రధానీ మోదీ నివాళి
Advertisement

PM Modi: దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జరుపుకునే జాతీయ ఐక్యత దినోత్సవం (National Unity Day).. ఈ సారి మరింత ఉత్సాహభరితంగా సాగుతోంది.

ఢిల్లీలో రన్ ఫర్ యూనిటీ ప్రారంభం

Advertisement

ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ జాతీయ స్టేడియం నుంచి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన

Advertisement

ప్రధాని మోదీ గుజరాత్ రాష్ట్రంలోని కెవాడియా (Ekta Nagar) లోని.. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్ పటేల్‌కు నివాళులు అర్పించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ విగ్రహం వద్ద ప్రధానమంత్రికి రక్షణ, సాంస్కృతిక శాఖలు ఘన స్వాగతం పలికాయి. భారత వాయుసేన విమానాలు సర్దార్ పటేల్ విగ్రహంపై.. పూల వర్షం కురిపించారు.

కెవాడియాలో రాష్ట్రీయ ఏక్తా దివస్ పరేడ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రిపబ్లిక్ డే తరహాలో ప్రతి సంవత్సరం ఈ పరేడ్ కొనసాగనుంది. ఈ పరేడ్‌లో గుజరాత్, అస్సాం, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పోలీసులు పాల్గొంటున్నారు. అదేవిధంగా బిఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్, సిఐఎస్‌ఎఫ్, ఐటిబిపి, ఎస్‌ఎస్‌బి, ఎన్‌సిసి బృందాలు కూడా పాల్గొంటున్నాయి.

భారతదేశ తొలి ఉప ప్రధాని, తొలి కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్.. దేశ చరిత్రలో అజరామరమైన నాయకుడు. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన పాత్ర అపూర్వమైనది. ఆయన చేసిన కృషి వల్లే దేశం రాజకీయంగా, భౌగోళికంగా ఏకతా సాధించగలిగింది. గాంధీజీ ఆయనను భారతదేశ ఉక్కు మనిషి అని ప్రశంసించారు.

Also Read: ఖమ్మం జిల్లాలో సీపీఎం నేత దారుణ హత్య

దేశవ్యాప్తంగా ఐక్యత పరుగు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఐక్యత పరుగు (Run for Unity) ఉత్సాహంగా జరిగింది.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×