E-Paper
Advertisement

Earthquake: బంగ్లాదేశ్‌లో భూకంపం.. ఆరుగురు మృతి, కోల్‌కతాలోనూ ప్రకంపనలు

Earthquake: బంగ్లాదేశ్‌లో భూకంపం.. ఆరుగురు మృతి, కోల్‌కతాలోనూ ప్రకంపనలు

Earthquake: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా పరిసర ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.7గా నమోదు అయ్యింది.  ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్టు తెలుస్తోంది.  అమెరికా జియోలాజికల్‌ సర్వే ప్రకారం బంగ్లాదేశ్‌లోని నర్సింగ్దీ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని కనుగొన్నారు. దాని ప్రభావం కోల్‌కతాపై పడింది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో భయంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. అలాగే ఆఫీసుల్లో ఉన్నవారు బయటకు పరుగులుపెట్టారు.

బంగ్లాదేశ్‌లో భూకంపం, ఆరుగురు మృతి

బంగ్లాదేశ్‌లో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఉదయం 10 గంటల సమయంలో సంభవించింది. భూకంప కేంద్రం బంగ్లాదేశ్‌లోని ఢాకా నుండి తూర్పు-ఆగ్నేయంగా 10 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆ దేశ నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. రాజధాని ఢాకాలో కనీసం ఆరుగురు మరణించారు. ముగ్గురిపై భవనం పైకప్పు గోడ కూలిపోయింది.  మరో 65 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.  ముగ్గురు పాదచారులపై భవనాల రెయిలింగ్‌లపై పడి మరణించారని ఢాకా కేంద్రంగా పని చేస్తున్న డీబీసీ టెలివిజన్ పేర్కొంది.

భూకంపంలో గాయపడిన 10 మందిని ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. మరో 10 మందిని గాజీపూర్‌లోని తాజుద్దీన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. నర్సింగ్డి జిల్లా ఆసుపత్రిలో 45 మంది గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అలీపూర్‌కు చెందిన రవీంద్ర‌సింగ్ మాట్లాడుతూ ప్రకంపనలు 30 సెకన్లకు పైగా కొనసాగాయని తెలిపారు. మొదట తన కళ్లు తిరుగుతున్నాయేమోనని కుటుంబసభ్యులు ఈ విషయం చెప్పానని అన్నాడు. ఆ తర్వాత భూకంపమేనని స్పష్టమైందన్నాడు. బలమైన ప్రకంపనలు తాము చూశామని, భవనాలు చెట్లు వణికినట్టు ఢాకా నివాసి సుమన్ రెహమాన్ అన్నాడు.

కోల్‌కతాలోనూ ప్రకంపనలు, బయటకు పరుగులు

పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ, ఉత్తర దినాజ్‌పూర్, కూచ్ బెహార్‌లతోపాటు మేఘాలయ, త్రిపుర, మిజోరం వంటి ఇతర రాష్ట్రాలలో స్పల్పంగా ప్రకంపనలు సంభవించాయి. అయితే ఇప్పటివరకు ఎవరూ గాయపడినట్టు గానీ, ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు తెలియలేదు. భూకంపం సమయంలో కోల్‌కతా పరిసర ప్రాంతాల బెంబేలెత్తిపోయారు. ఇంటి ఫ్యాన్లు ఊగడం కనిపించడంతో బయటకు పరుగులు తీశారు. ఇక ప్రభుత్వం, ప్రైవేటు ఆఫీసులకు వెళ్లినవారు ఒక్కసారిగా భూమి కంపించడంతో వెంటనే బయటకు పరుగులు పెట్టారు. దాదాపు గంట వరకుగానీ ఉద్యోగులు ఆఫీసు లోపలికి వెళ్లలేదు.

ALSO READ: లుథియానాలో భారీ ఎన్‌కౌంటర్.. టెర్రరిస్టులకు గాయాలు

గురువారం పాకిస్తాన్‌లో 3.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆదేశ నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. 10 కి.మీ లోతులో భూకంపం కేంద్రాన్ని కనుగొన్నారు. దీనికారణంగా ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఉత్తర భారతదేశం..  ప్రపంచంలో అత్యంత భూకంప క్రియాశీల మండలాల్లో ఒకటిగా ఉన్నాయి. భారత-యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే ప్రాంతం కావడంతో మధ్యస్థం నుండి బలమైన భూకంపాలు సంభవిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

 

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×