E-Paper
Advertisement

Viral News: ఏకంగా రైల్లోనే బట్టలు ఆరేశాడు, నువ్వు ఓ వర్గానికి ఇన్ స్ప్రేషన్ బ్రో!

Viral News: ఏకంగా రైల్లోనే బట్టలు ఆరేశాడు, నువ్వు ఓ వర్గానికి ఇన్ స్ప్రేషన్ బ్రో!
Advertisement

Viral Railway News:

భారతీయ రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ఆహ్లాదకరంగా ప్రయాణించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కువ మంది రైల్లో వెళ్లేందుకు మొగ్గు చూపుతారు. ప్రయాణ సమయంలో ప్రయాణీకులు చేసే వింత వింత పనులు తరచుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

రైల్లో బట్టలు ఆరేసిన ప్రయాణీకుడు

సాధారణంగా రైళ్లలో పిల్లలు ఏడ్వకుండా ఉయ్యాలలు కట్టిన సందర్భాలను చూశాం. కానీ, తాజాగా ఓ వ్యక్తి ఏకంగా రైల్లో బట్టలు ఆరేసిన ఘటన నెటిజన్లకు క్రేజీగా అనిపిస్తంది. దీనికి సంబంధించిన ఓ ఫోటోను రెడ్డిట్ వినియోగదారుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో ఏకంగా ఓ వ్యక్తి అప్పర్ బెర్త్ కు జోడించిన యుటిలిటీ ర్యాక్ మీద బట్టలు ఆరేశాడు. భారతీయ రైల్వేలో మాత్రమే ఇలాంటి అరుదైన ఘటనలు కనిపిస్తాయంటూ సదరు వ్యక్తి ఆ ఫోటోకు క్యాప్షన్ పెట్టాడు.  మైసూరు-జైపూర్ ఎక్స్‌ ప్రెస్‌ లో AC కోచ్‌లో సీటు పొందలేకపోయినప్పటికీ.. ఉచిత లాండ్రీ సేవను పొందుతున్నారంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు.

Advertisement

Read Also: అనకాపల్లికి ప్రత్యేక రైళ్లు, పండుగ సీజన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం!

నెటిజన్ల ఏం అంటున్నారంటే?

ఇక ఈ ఘటనకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. కొంత మంది ఈ చర్యను ఆసక్తికరమైన చర్యగా అభివర్ణిస్తే, మరికొంత మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాలకు కనీస ప్రవర్తన తెలియకుండా పోతుందంటూ మండిపడ్డారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని మరికొంత మంది డిమాండ్ చేశారు. “విదేశాలలో ఇలాంటి ఘటనలను ఎప్పుడూ చూడలేం. కేవలం ఇండియాలో మాత్రమే ఇలాంటి ఘటనలు సాధ్యం. నిజంగా అతడి ఆలోచన భలే ఉంది” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “ఈ చర్య ప్రజా రవాణలో బాధ్యతారాహిత్యాన్ని చూపిస్తుంది. ఇలాంటి పనులు రైళ్లలోనే కాదు, ఎక్కడా చేయడం మంచిది కాదు. ఇలాంటి పనుల వల్ల ఇతరులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “రైల్లో బట్టలు ఆరేయాలనే ఆలోచనే చాలా కొత్తగా ఉంది. నిజంగా నువ్వు గ్రేట్ బ్రదర్” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. మొత్తంగా ఈ ఘటన సోషల్ మీడియాలో ఎక్కువగా ఆహ్లాదాన్ని పంచింది.

Advertisement

ఇక గతంలో ఓ వ్యక్తి ఏకంగా సామన్లు ఉంచే ర్యాక్ లో నిద్రపోవడం అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. “అక్కడ పడుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది బ్రో” అంటూ ఫన్నీగా కామెంట్స్ పెట్టారు.

Read Also: ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే ఇండియన్ స్టేట్ ఇదే, వామ్మో.. ఏడాదిలో అంత మందా?

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×