Maoists Encounter: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ – దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టుల కదలికలపై అందిన ముందస్తు సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
ఛత్తీస్గఢ్-అబూజ్మడ్ అడవుల్లో ఎన్కౌంటర్.. 9 మంది మావోలు హతం
ఈ భీకర పోరాటంలో ఇప్పటివరకు తొమ్మిది మంది మావోయిస్టులు మరణించినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. కాల్పులు తగ్గుముఖం పట్టిన తర్వాత ఘటనా స్థలంలో సోదాలు నిర్వహించగా, ప్రస్తుతం ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మిగిలిన వారి కోసం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సంఘటనా స్థలం నుండి భారీగా ఆయుధాలు, విప్లవ సాహిత్యం, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భద్రతా దళాలు,మావోయిస్టుల మధ్య కొనసాగుతున్న ఎదురుకాల్పులు
దట్టమైన అడవులు, కొండ ప్రాంతం కావడంతో ఆపరేషన్ నిర్వహించడం సవాలుగా మారినప్పటికీ, వ్యూహాత్మకంగా వ్యవహరించిన భద్రతా బలగాలు మావోయిస్టుల స్థావరాలను చుట్టుముట్టాయి. మరణించిన మావోయిస్టుల్లో కీలక నేతలు ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఎన్కౌంటర్ వల్ల మావోయిస్టు నెట్వర్క్కు పెద్ద దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతం మొత్తం పోలీసుల పహారాలో ఉంది.
Also Read: గడ్చిరోలి లో కొనసాగుతున్న కూంబింగ్.. మావోయిస్టులకు భద్రత బలగాలకు మధ్య భీకర కాల్పులు!
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం గడిచిన కొద్ది కాలంగా మావోయిస్టుల నిర్మూలన కోసం ‘ఆపరేషన్ కగార్’ వంటి ప్రత్యేక కార్యక్రమాలను వేగవంతం చేశాయి. ఈ క్రమంలోనే అబూజ్మడ్ వంటి కంచుకోటల్లోకి చొచ్చుకెళ్లి బలగాలు దాడులు నిర్వహిస్తున్నాయి. తాజా ఘటనతో బస్తర్ మేఖలలో అలజడి నెలకొనగా, సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. మృతుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఉన్నతాధికారులు తెలిపారు.
ఎన్కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్-అబూజ్మడ్ అడవుల్లో ఎన్కౌంటర్
అబూజ్మడ్ అడవుల్లో భద్రతా దళాలు,మావోయిస్టుల మధ్య కొనసాగుతున్న ఎదురుకాల్పులు
ఈ ఎదురుకాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మృతి
ప్రస్తుతం ఐదుగురి మృతదేహాలు లభ్యం
9 Maoists killed in encounter in… pic.twitter.com/3fCCo6S7my
— BIG TV Breaking News (@bigtvtelugu) February 6, 2026