Nikhil Swayambhu: టాలీవుడ్లో ప్రస్తుతం ఒక విషయం తెగ వినిపిస్తోంది.. అదేమిటంటే అడవి శేష్ నటిస్తున్న డాకోయిట్ సినిమా.. నిఖిల్ సిద్ధార్థ నటిస్తున్న స్వయంభూ సినిమా ఒకే సమయంలో విడుదల అయితే ఏమవుతుంది అనే ప్రశ్న ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ రెండు సినిమాలు ఒకే వారం విడుదలైతే ఇద్దరు హీరోలకూ ఇది రిస్క్గా మారుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అడవి శేష్ గత కొన్ని సంవత్సరాలుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆయన సినిమాలు అంటే కంటెంట్ బాగుంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. కథ ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకే ఆయన సినిమాలకు మంచి వర్డ్ ఆఫ్ మౌత్ వస్తుంది. డాకోయిట్ సినిమా కూడా అలాంటి కథతోనే రూపొందుతోంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇది సీరియస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. అంతేకాదు, ఈ కథను అడవి శేష్ తానే కలిసి రాయడం వల్ల ఈ సినిమాపై ఆయనకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది.
ఇక నిఖిల్ నటిస్తున్న స్వయంభూ సినిమా పూర్తిగా భిన్నమైన జానర్లో ఉంది. ఇది భారీ విజువల్స్, వీఎఫ్ఎక్స్తో రూపొందుతున్న ఎపిక్ సినిమా. ఇలాంటి సినిమాలు థియేటర్లో పెద్ద స్క్రీన్ అనుభూతి కోసం ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. ముఖ్యంగా మొదటి వారాంతంలో ఇలాంటి సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే అసలు సమస్య టైమింగ్ దగ్గరే ఉంది. ఈ రెండు సినిమాలు విడుదల కావాలని అనుకుంటున్న సమయంలో పెద్ద పండుగ గానీ, లాంగ్ వీకెండ్ గానీ లేదు. సెలవులు లేని సమయంలో రెండు పెద్ద సినిమాలు ఒకేసారి వస్తే ప్రేక్షకులు విడిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు రెండు సినిమాల కలెక్షన్లు ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది.
ఇదే కారణంతో డాకోయిట్ సినిమాను ముందుగా ఏప్రిల్ 10, 2026కి వాయిదా వేశారు. అప్పట్లో ధురంధర్ 2, టాక్సిక్ లాంటి పెద్ద సినిమాల క్లాష్ను తప్పించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. అదే లాజిక్ స్వయంభూ విషయంలో కూడా వర్తిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
అడవి శేష్.. నిఖిల్ సినిమాలు ఒకే తేదీకి వస్తే ఇద్దరికీ తలనొప్పే అవుతుందని టాక్. అందుకే మేకర్లు సరైన తేదీని ఎంచుకుని, క్లాష్ లేకుండా విడుదల చేస్తేనే మంచిదని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే స్వయంభు పలుమార్లు పోస్ట్ పోన్ అవ్వగా ఇప్పుడు మళ్లీ పోస్ట్ పోన్ అవుతుందా లేదా చూడాలి.
ALSO READ: NBK112: జూ. ఎన్టీఆర్ తో పాటు బాలకృష్ణని కూడా సెట్ చేసిన దర్శకుడు