BigTV English

Punjab Car Accident: వరదలో కొట్టుకుపోయిన పెళ్లి బృందం కారు.. 9 మంది మృతి

Punjab Car Accident: వరదలో కొట్టుకుపోయిన పెళ్లి బృందం కారు.. 9 మంది మృతి

Punjab Car Accident: పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. బెజో ఖాడ్‌లో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు వరదలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. వీరంతా హిమాచల్ ప్రదేశ్‌లోని ఉన్నా జిల్లా దేహ్లా గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది. పంజాబ్‌లోని హిషియార్ పూర్ జిల్లా మహల్‌పూర్‌కు పెళ్లి కోసం వెళుతుండగా ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న మార్గంలో కాలువ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కారుతో పాటు అందులో ఉన్న వారంతా వరదలో కొట్టకుని పోయారు.


పంజాబ్‌లోని బెజో ఖాడ్‌లో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే కారులో ఉన్న వారిలో 8 మంది మృతి చెందారు. కారుతో పాటు వారి మృతదేహాలను బయటకు తీసారు. మరో వ్యక్తి మృత దేహాం కోసం గాలింపు చేపట్టారు. ఇదిలా ఉంటే కారు ప్రమాదంలో ఓ వ్యక్తి తప్పించుకుని ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో పోలీసులు అతడిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు.

Also Read: ట్రైన్‌లో మంటలు అంటూ ప్రచారం.. బ్రిడ్జీపై నుంచి దూకేసిన ప్రయాణికులు


ఈ ఘటనపై హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సుఖు, డిప్యూటీ సీఎం ముఖేష్ అగ్ని హోత్రి సంతాపం వ్యక్తం చేశారు. సీఎం సుఖు.. హిమాచల్ ప్రదేశ్ – పంజాబ్ సరిహద్దు సమీపంలో బలమైన నీటి ప్రవాహం కారణంగా ఉన్నా జిల్లాలోని దేహ్లా గ్రామానికి చెందిన 9 మంది మృతి చెందారు. ఘటన గురించి స్థానిక అధికారులతో మాట్లాడుతున్నాను. బాధితుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటాం. చని పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలి అని కోరుకుంటున్నాం అని ట్వీట్ చేశారు.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×