BigTV English
Advertisement

Rahul Gandhi: హిండెన్ బర్గ్ ఆరోపణలు.. ప్రధానిపై రాహుల్ సెటైర్లు

Rahul Gandhi: హిండెన్ బర్గ్ ఆరోపణలు.. ప్రధానిపై రాహుల్ సెటైర్లు

Rahul Gandhi: అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్ బర్గ్ ఛైర్ సర్సన్ మాధవి పురి బచ్‌పై చేసిన ఆరోపణలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. హిండెన్ బర్గ్ ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారో సెల్లార్ సంస్థ నివేదిక స్పష్టంగా తెలుపుతుందని అన్నారు. చిన్న రిటైల్ ఇన్వెస్టర్ల సంపదను కాపాడే బాధ్యతను అప్పగించిన సెక్యురిటీస్ రెగ్యులేటన్ సెబీ.. సమగ్రత, చైర్ పర్సన్‌పై వచ్చిన ఆరోపణలతో రాజీ పడిందని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు.


సెబీ చైర్ పర్సన్ ఎందుకు రాజీనామా చేయలేదో దేశ వ్యాప్తంగా పెట్టుబడుదారులు తెలుసుకుంటున్నారని రాహుల్ తెలిపారు. ఛైర్ పర్సన్‌పై వచ్చిన ఆరోపణలతో సెబీ పవిత్రత దెబ్బతింది. దేశ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడుదారులు ప్రస్తుతం ప్రభుత్వాన్ని 3 ప్రశ్నలు అడుగుతున్నారు. సెబీ ఛైర్ పర్సన్ మధవీ పురి ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు ? ఇన్వెస్టర్లు తాము కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతే ఎవరు వారికి జవాబుదారీగా ఉంటారు ? ప్రధాని మోదీయా ? లేక సెబీ ఛైర్ పర్సనా లేదా అదానీనా తీవ్రమైన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ అంశాన్ని కోర్టు మరో సారి సుమోటాగా పరిశీలిస్తుందా ? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

Also Read: వరదలో కొట్టుకుపోయిన పెళ్లి బృందం కారు.. 9 మంది మృతి


ఇదిలా ఉంటే హిండెన్ బర్గ్ ఆరోపణలను మాధవీ పురి ఇప్పటికే ఖండించారు. ఆ సంస్థ తన వ్యక్తిత్వ  ఆరోపణలకు పాల్పడుతోందని వెల్లడించారు. తమ ఆర్థిక రికార్డులను బహిర్గతం చేస్తామని అన్నారు. తాము ప్రయివేట్ వ్యక్తులుగా ఉన్న రోజుల్లో ఆర్థిక కార్యకలాపాల వివరాలు కూడా అధికారులకు అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అదానీ గ్రూప్ కూడా ఈ ఆరోపణలు కుట్ర పూరితమే అంటూ కొట్టిపారేసింది. వ్యక్తిగత లాభం కోసమే సమాచారాన్ని వక్రీకరిస్తూ వినియోగదారులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొంది.

Related News

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Big Stories

×