E-Paper
Advertisement

జంతర్ మంతర్ నిరసన కేవలం ట్రైలర్ మాత్రమే.. సీజెపీ వ్యవస్థాపకుడు సంచలన ట్వీట్!

జంతర్ మంతర్ నిరసన కేవలం ట్రైలర్ మాత్రమే.. సీజెపీ వ్యవస్థాపకుడు సంచలన ట్వీట్!
Advertisement

Abhijit Deepke: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన శాంతియుత నిరసనపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ట్వీట్ చేశారు.

చరిత్ర సృష్టించిన శాంతియుత నిరసన

Advertisement

విద్యా వ్యవస్థలో జరుగుతున్న లోపాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో కలిసి చరిత్ర సృష్టించామని అభిజిత్ దీప్కే ప్రకటించారు. తీవ్రమైన ఎండను సైతం లెక్కచేయకుండా చిన్న పిల్లలు, విద్యార్థులు, సాధారణ ప్రజలు ఈ నిరసనలో పాల్గొన్నారు. అసలు జీవితంలో ఎన్నడూ ఇలాంటి ధర్ణాల్లో పాల్గొనని వారు కూడా విద్యా వ్యవస్థపై ఉన్న కోపంతో మొదటిసారి రోడ్డుపైకి వచ్చారు. మనమంతా కలిసికట్టుగా ఉంటే ప్రభుత్వం ముందు మన గొంతు ఎంత బలంగా వినబడుతుందో చెప్పడానికి ఈ నిరసన ఒక చిన్న ‘ట్రైలర్’ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

రాజీలేని పోరాటం.. 7 రోజుల అల్టిమేటం!

Advertisement

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక పూర్తి తరం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారని, వారికి తీవ్ర అన్యాయం చేశారని అభిజిత్ దీప్కే ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన ప్రభుత్వానికి ఒక స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. రాబోయే 7 రోజుల్లోగా ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించకపోయినా, లేదా ఆయనే స్వచ్ఛందంగా తప్పుకోకపోయినా తమ నిరసనలను క్షేత్రస్థాయిలో మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

భవిష్యత్తు కార్యాచరణపై లైవ్

‘బొద్దింకల లాంటి సామాన్య ప్రజలమైన మనం ఐక్యంగా ఉంటే ప్రభుత్వానికి భయపడాల్సిన పనిలేదు’ అంటూ ధీమా వ్యక్తం చేసిన అభిజిత్, ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించిన తదుపరి ప్రణాళికలు, భవిష్యత్తు కార్యాచరణను వివరించడానికి ఈ రోజు సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్ (Instagram) లైవ్‌లోకి రానున్నట్లు ఆయన తన ట్వీట్‌లో వెల్లడించారు.

Also Read: ఐటీ హబ్‌లో విషాదం.. ప్రియుడితో గొడవపడి యువతి ఆత్మహత్య!

Related News

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

Big Stories

Advertisement
×