E-Paper
Advertisement

జంతర్ మంతర్ నిరసన కేవలం ట్రైలర్ మాత్రమే.. సీజెపీ వ్యవస్థాపకుడు సంచలన ట్వీట్!

జంతర్ మంతర్ నిరసన కేవలం ట్రైలర్ మాత్రమే.. సీజెపీ వ్యవస్థాపకుడు సంచలన ట్వీట్!
Advertisement

Abhijit Deepke: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన శాంతియుత నిరసనపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ట్వీట్ చేశారు.

చరిత్ర సృష్టించిన శాంతియుత నిరసన

Advertisement

విద్యా వ్యవస్థలో జరుగుతున్న లోపాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో కలిసి చరిత్ర సృష్టించామని అభిజిత్ దీప్కే ప్రకటించారు. తీవ్రమైన ఎండను సైతం లెక్కచేయకుండా చిన్న పిల్లలు, విద్యార్థులు, సాధారణ ప్రజలు ఈ నిరసనలో పాల్గొన్నారు. అసలు జీవితంలో ఎన్నడూ ఇలాంటి ధర్ణాల్లో పాల్గొనని వారు కూడా విద్యా వ్యవస్థపై ఉన్న కోపంతో మొదటిసారి రోడ్డుపైకి వచ్చారు. మనమంతా కలిసికట్టుగా ఉంటే ప్రభుత్వం ముందు మన గొంతు ఎంత బలంగా వినబడుతుందో చెప్పడానికి ఈ నిరసన ఒక చిన్న ‘ట్రైలర్’ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.

రాజీలేని పోరాటం.. 7 రోజుల అల్టిమేటం!

Advertisement

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక పూర్తి తరం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారని, వారికి తీవ్ర అన్యాయం చేశారని అభిజిత్ దీప్కే ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన ప్రభుత్వానికి ఒక స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. రాబోయే 7 రోజుల్లోగా ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించకపోయినా, లేదా ఆయనే స్వచ్ఛందంగా తప్పుకోకపోయినా తమ నిరసనలను క్షేత్రస్థాయిలో మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

భవిష్యత్తు కార్యాచరణపై లైవ్

‘బొద్దింకల లాంటి సామాన్య ప్రజలమైన మనం ఐక్యంగా ఉంటే ప్రభుత్వానికి భయపడాల్సిన పనిలేదు’ అంటూ ధీమా వ్యక్తం చేసిన అభిజిత్, ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించిన తదుపరి ప్రణాళికలు, భవిష్యత్తు కార్యాచరణను వివరించడానికి ఈ రోజు సాయంత్రం ఇన్‌స్టాగ్రామ్ (Instagram) లైవ్‌లోకి రానున్నట్లు ఆయన తన ట్వీట్‌లో వెల్లడించారు.

Also Read: ఐటీ హబ్‌లో విషాదం.. ప్రియుడితో గొడవపడి యువతి ఆత్మహత్య!

Related News

Delhi Protests: ఢిల్లీ పోలీసుల లాఠీఛార్జ్‌పై కోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ!

Sonam Wangchuk: ఆ హామీ ఇస్తే.. దీక్ష విరమిస్తా..కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ!

Rahul Gandhi: మోదీ సర్కార్‌కు రాహుల్ గాంధీ వార్నింగ్.. పేపర్ లీకుల లెక్కలు బయటపెట్టిన రాహుల్!

Chinta Mohan: మోడీకి రాజ్యాంగం తెలీదు.. అమిత్ షా రాజ్యాంగం నడుస్తోంది! చింతా మోహన్ సంచలన కామెంట్స్

Education Bandh: ‘నీట్’ లీకేజీపై విరుచుకుపడ్డ విద్యార్థి లోకం.. జులై 24న విద్యాసంస్థల బంద్!

Rajnath Singh: ఢిల్లీ నిరసనలపై రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఎమన్నారంటే?

Delhi Metro: దిల్లీ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. భద్రతా కారణాలతో 16 స్టేషన్లు మూసివేత!

సమయం వృథా.. వీడియోలు చూసే టైమ్ లేదు, విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు

Big Stories

Advertisement
×