BigTV English
Advertisement

Big BREAKING: సికింద్రాబాద్ షాలిమార్ రైలుకు ప్ర‌మాదం.. ప‌ట్టాలు త‌ప్పిన మూడు బోగీలు..ప‌రిస్థితి ఎలా ఉందంటే?

Big BREAKING: సికింద్రాబాద్ షాలిమార్ రైలుకు ప్ర‌మాదం.. ప‌ట్టాలు త‌ప్పిన మూడు బోగీలు..ప‌రిస్థితి ఎలా ఉందంటే?

సికింద్రాబాద్-షాలిమార్ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుకు ప్ర‌మాదం జ‌రిగింది. ఉద‌యం పశ్చిమ బెంగాల్ లోని హౌరా సమీపంలో రైలు మూడు కోచ్ లు ప‌ట్టాలు త‌ప్పాయి. ఉద‌యం 5.31గంట‌ల‌కు ఖ‌ర‌గ్ పూర్ డివిజ‌న్ లోని స‌ల్పూర్ స్టేష‌న్ గుండ‌గా వెళుతుండ‌గా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎక్స్ ప్రెస్ కు చెందిన పార్సిల్ వ్యాన్ తో పాటు ప్రయాణీకులు ఉన్న రెండు కోచ్ లు అదుపు త‌ప్పాయి. అయితే ఈ ప్ర‌మాదంలో ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌లేదు. ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.


Also read: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు హైదరాబాదీలు మృతి

వెంట‌నే ఘ‌ట‌నా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ప‌రిస్థితి ప‌రిశీలించి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప్రయాణికులను కింద‌కి దింపి ఇత‌ర రైళ్ల‌కు అంత‌రాయం క‌ల‌గ‌కుండా బోగీల‌ను ప‌క్క‌కు జ‌రిపిస్తున్నారు. రైలు మ‌ధ్య ప‌ట్టాల మీద నుండి బ‌య‌టి ప‌ట్టాల‌పైకి మారుతున్న స‌మ‌యంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్న‌ట్టు తెలిపారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ఖ‌ర‌గ్ పూర్ నుండి ప్ర‌త్యేక రైల్లు ఏర్పాటు చేసి ప్రయాణీకుల‌ను త‌ర‌లించారు. అంతే కాకుండా గ‌మ్య‌స్థానం ద‌గ్గ‌ర‌లోనే ఉన్న‌వారిని త‌ర‌లించ‌డానికి బ‌స్సుల‌ను కూడా ఏర్పాటు చేశారు.


పెరుగుతున్న రైతు ప్ర‌మాదాలు:

ఇదిలా ఉంటే ఇటీవ‌ల రైలు ప్ర‌మాదాలు పెరిగిపోయిన సంగ‌తి తెలిసిందే. గ‌డిచిన ఐదేళ్ల‌లో జ‌రిగిన రైలు ప్ర‌మాదాల్లో 351 మంది ప్రాణాలు కోల్పోయారు. 970 మంది గాయ‌ప‌డ్డారు. మొత్తం 200 రైలు ప్రమాద ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. వ‌రుస ప్ర‌మాదాల‌పై గ‌త నెల స్పందించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్ ప‌దేళ్ల కింద‌ట ఏడాదికి 171 ప్రమాదాలు జ‌రిగితే ప్ర‌స్తుతం ఆ సంఖ్య 40కి త‌గ్గిందని చెప్పారు.

Related News

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Delhi Politics: ఓట్‌ చోరీపై కొత్త బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ.. బ్రెజిల్‌ మోడల్‌‌కు ఓటు హక్కు, హవ్వా

Train Accident: రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల మీదకు దూసుకెళ్లిన రైలు.. ఆరుగురు స్పాట్ డెడ్

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Delhi Air Pollution: ఇక బతకడం కష్టమే! గ్యాస్ చాంబర్‌లా మారిన ఢిల్లీ

Big Stories

×