BigTV English

Atal Setu | 264 మంది వాహనదారులపై ట్రాఫిక్ చలాన్.. అటల్ సేతుపై వాహనాలు ఆపితే చర్యలు తప్పవు

Atal Setu | 264 మంది వాహనదారులపై ట్రాఫిక్ చలాన్.. అటల్ సేతుపై వాహనాలు ఆపితే చర్యలు తప్పవు

Atal Setu | దేశంలోనే అతి పొడవైన వంతెన ముంబైలో సముద్రం మీదుగా నిర్మించబడింది. దాని పేరే అటల్ సేతు(ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్). ముంబై నుంచి నవీ ముంబై వరకు సముద్రం మీదుగా 21.8 కిలీమీటర్ల పొడువున ఈ బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రాకముందు ముంబై నుంచి నవీ ముంబైకి వెళ్లాలంటే గంటన్నర సమయం పట్టేది. ఇప్పుడు అటల్ సేతు మీదుగా ప్రయాణం చేస్తే కేవలం 20 నిమిషాల్లో గమ్యం చేరుకోవచ్చు. ఈ బ్రిడ్జి పై ఆటోలు, ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు.


ఇటీవల జనవరి 12న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అటల్ సేతు వంతెనను ప్రారంభించారు. సముద్రం మధ్యలోకి వంతెనపై నుంచి వెళ్లి అక్కడి అందమైన దృశ్యాలను ఆస్వాదించడానికి ముంబై వాసులు బారులుతీరుతున్నారు. దీంతొ ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పి మొదలైంది. వంతెనపై కొన్ని గంటలపాటు కార్లు ఆపి ముంబై వాసులు సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు మొదలవుతున్నాయి.

వంతెన మధ్యలో కొందరు బర్త్ డేలు చేసుకుంటూ రెయిలింగ్‌పైకి ఎక్కుతున్నారు. ఆ పార్టీలకు సంబంధించిన వీడియోలు ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్లు వంతెన మధ్యలో ఆపితే ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నా వినకపోవడంతో.. పోలీసులు ఇకపై అలా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


తాజాగా వంతెన మధ్యలో వాహనాలు ఆపిన వారికి రూ.500 చొప్పున ఫైన్ విధించారు. అలా ఒక్క ఆదివారం రోజునే 264 వాహనదారులపై ముంబై ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. ఆ తరువాత ట్విట్టర్‌ ద్వారా ముంబై పోలీసులు వాహనదారులకు హెచ్చరించారు. ”అటల్ సేతు బ్రిడ్జి చూడదగ్గ ప్రదేశమే అయినప్పటికీ అది పిక్నిక్ స్పాట్ కాదు. వంతెన మధ్యలో కార్లు ఆపడం, ఫోటోలు తీసుకోవడం వంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం,” అని పోస్టు పెట్టారు.

పోలీసులతో పాటు కొంతమంది నెటిజెన్లు కూడా వంతెన మధ్యలో వాహనాలు ఆపినవారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు.

Tags

Related News

TVK Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన.. ఎఫ్ఐఆర్ లో కనిపించని విజయ్ పేరు.. డీఎంకే వ్యూహమేంటి?

Jan Dhan Account Re-KYC: జన్‌ధన్ బ్యాంక్ అకౌంట్.. మంగళవారంతో క్లోజ్, వెంటనే ఆ పని చేయండి

Whiskey Sales: దేశంలో విస్కీ అమ్మకాల లెక్కలు.. టాప్‌లో సౌత్ రాష్ట్రాలు, ఏపీ-తెలంగాణల్లో ఎంతెంత?

Chennai News: కరూర్ తొక్కిసలాట ఘటన.. రంగంలోకి జస్టిస్ అరుణ జగదీశన్, ఇంతకీ ఎవరామె?

Chennai News: విజయ్ పార్టీ సంచలన నిర్ణయం.. హైకోర్టులో పిటిషన్, సీబీఐ విచారణ కోసం?

Bihar News: బీహార్ ప్రీ-పోల్ సర్వే.. మహా కూటమికి అనుకూలం, ఎన్డీయే కష్టాలు? చివరలో ఏమైనా జరగొచ్చు

Pakistan Prime Minister: భారత్‌పై విషం కక్కిన పాక్ ప్రధాని.. మోడీ స్కెచ్ ఏంటి?

Chennai News: పార్టీ తరపున మృతులకు 20 లక్షలు.. టీవీకే నేతలపై కేసులు, విజయ్ ఇంటి వద్ద భారీ భద్రత

Big Stories

×