BigTV English

Rahul Gandhi : రాహుల్‌ గాంధీకి అయోధ్య పూజారి లేఖ.. ఎందుకంటే..?

Rahul Gandhi : రాహుల్‌ గాంధీకి అయోధ్య పూజారి లేఖ.. ఎందుకంటే..?

Rahul Gandhi : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో బీజీగా ఉన్నారు. ఈ పాదయాత్ర చేపట్టిన తర్వాత ఆయన ఇమేజ్ మరింత పెరిగింది. అన్నివర్గాల నుంచి ఆదరణ పెరిగింది. సామాన్యులతో ఆయన మమేకమవుతున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఓ వార్త మరింత ఆసక్తిని పెంచింది. అయోధ్య రామజన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ రాహుల్ కు లేఖ రాశారు. రాముడి ఆశీస్సులు రాహుల్‌కు లభించాలని ఆకాంక్షించారు. దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు రాహుల్‌ చేపట్టిన యాత్ర ఫలవంతం కావాలన్నారు. ప్రజల సుఖం, సంతోషం కోసం ప్రయత్నిస్తున్న రాహుల్ కు రాముడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నానని తన సందేశంలో సత్యేంద్ర దాస్‌ పేర్కొన్నారు.


సత్యేంద్ర దాస్‌ భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని అనుకున్నారని కాంగ్రెస్‌ పార్టీ అయోధ్య జిల్లా ప్రతినిధి సునీల్‌ కృష్ణ గౌతమ్ తెలిపారు. ఆయన ఆరోగ్యం సహకరించకపోవడంతో రావడంలేదన్నారు. ఆయన నైతిక మద్దతును లేఖ ద్వారా తెలిపారని పేర్కొన్నారు. తొమ్మిది రోజుల విరామం తర్వాత భారత్‌ జోడో యాత్ర ఢిల్లీలో మళ్లీ ప్రారంభమైంది. ఇప్పటికే ఈ యాత్ర 110 రోజులపాటు సాగింది. దేశవ్యాప్తంగా 3 వేల కిలోమీటర్లు నడిచారు రాహుల్ గాంధీ.

సెప్టెంబర్‌ 7న కన్యాకుమారీలో మొదలైన యాత్ర తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌,మహారాష్ట్ర, హర్యానాలో సాగింది. జనవరి 26 శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ముగించనున్నారు. మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ యాత్రకు ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, బీఎస్పీ చీఫ్‌ మాయావతి మద్దతు పలికారు.


Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×