E-Paper
Advertisement

Bilkis Bano | లొంగిపోయేందుకు మరింత సమయం కావాలి.. సుప్రీంకు బిల్కిస్ బానో దోషులు

Bilkis Bano | గుజరాత్‌ గోధ్రా అల్లర్లకు సంబంధించిన బిల్కిస్ బానో కేసు దోషులు తిరిగి జైలుకు వెళ్లడానికి మరింత సమయం కావాలని గురువారం జనవరి 18న సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసులో మొత్తం 11 మంది దోషులుండగా.. వారిలో ముగ్గురు మాత్రమే కోర్టులో పిటిషన్ వేశారు. మిగతా దోషులు పరారీలో ఉన్నట్లు సమాచారం.

Bilkis Bano | లొంగిపోయేందుకు మరింత సమయం కావాలి.. సుప్రీంకు బిల్కిస్ బానో దోషులు

Bilkis Bano | గుజరాత్‌ గోధ్రా అల్లర్లకు సంబంధించిన బిల్కిస్ బానో కేసు దోషులు తిరిగి జైలుకు వెళ్లడానికి మరింత సమయం కావాలని గురువారం జనవరి 18న సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసులో మొత్తం 11 మంది దోషులుండగా.. వారిలో ముగ్గురు మాత్రమే కోర్టులో పిటిషన్ వేశారు. మిగతా దోషులు పరారీలో ఉన్నట్లు సమాచారం.

లొంగిపోవడానికి ఇంకా సమయం అవసరమని కారణాలు చూపుతూ.. ఒకరు తనకు ఊపితిత్తుల ఆపరేషన్ జరిగిందని చెప్పగా.. మరొకరు తన పండించిన పంట కోత సమయం చెప్పారు. మూడో దోషి తన కొడుకు పెళ్లి ఉందని కారణం చూపారు.

బిల్కిస్ బానోపై రేప్, ఆమె కుటుంబం(పిల్లలు, చెల్లెలు, తల్లి)లోని మొత్తం 11 మందిని హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన ఈ 11 మంది 2022 సంవత్సరంలో జైలు నుంచి శిక్షాకాలం పూర్తి చేయకుండానే విడుదల అయ్యారు. గుజరాత్ ప్రభుత్వం చొరవ తీసుకొని వీరందరినీ విడుదల చేసింది. విడుదలైన రోజు వీరందరికీ పూల మాలలు వేసి ఒక రాజకీయ పార్టీ సభ్యులు సత్కరించారు. దీంతో ఈ కేసు దేశమంతా సంచలనం సృష్టించింది.

అయితే ఇటీవల సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని వ్యాఖ్యానిస్తూ.. బిల్కిస్ బానో దోషుల విడుదలను రద్దు చేసింది. వారందరినీ రెండు వారాల లోపు తిరిగి జైలుకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో 11 మంది దోషలందరూ జనవరి 21 2024 లోపు పోలీసుల వద్ద లొంగిపోవాలి.

అయితే మరో మూడు రోజుల్లో సుప్రీం కోర్టుకు ఇచ్చిన గడువు ముగిసిపోనుండగా.. ఈ దోషులలో ముగ్గురు.. లొంగిపోయేందుకు మరింత సమయం ఇవ్వాలని కోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్‌పై దేశ అత్యున్నత కోర్టు శుక్రవారం జనవరి 19న విచారణ చేపట్టడానికి అంగీకరించింది.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×