E-Paper
Advertisement

BJP Candidates For Rajyasabha Elections: బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. ఒడిశా నుంచి అశ్వినీ వైష్ణవ్‌ పోటీ..

BJP Candidates For Rajyasabha Elections: బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. ఒడిశా నుంచి అశ్వినీ వైష్ణవ్‌ పోటీ..

BJP Rajyasabha Candidates Second List: రాజ్యసభ ఎన్నికలపై బీజేపీ కసరత్తు చేస్తోంది. ఆ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది. ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒడిశా నుంచి బరిలోకి దిగనున్నారు. మరో కేంద్రమంత్రి ఎల్ . మురుగన్ మధ్యప్రదేశ్ నుంచి పోటీ చేయనున్నారు. అశ్వినీ వైష్ణవ్, ఎల్. మురుగన్ రెండోసారి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు.
అశ్వినీ వైష్ణవ్‌కు ఒడిశాలో అధికార పార్టీ బిజూ జనతాదళ్‌ సపోర్టు చేస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

మధ్యప్రదేశ్‌లో 5 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో 4 బీజేపీకే దక్కే ఛాన్స్ ఉంది. ఒక స్థానంలో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా. మధ్య ప్రదేశ్ లో బీజేపీ అభ్యర్థులుగా మరుగన్ తోపాటు ఉమేశ్‌ నాథ్‌ మహరాజ్‌, మాయ మరోలియా, బన్సీలాల్‌ గుర్జార్‌ ను ప్రకటించారు.

రాజస్థాన్‌లో 2 స్థానాలకు బీజేపీ పోటీ చేస్తోంది. మాజీ మంత్రి చున్నీలాల్‌ గరాసియా, మాజీ ఎమ్మెల్యే మదన్‌ రాథోడ్‌ రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించింది. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ పీఎం మన్మోహన్‌ సింగ్‌, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ పదవీ కాలం ఏప్రిల్‌ 3తో ముగుస్తుంది.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×