BJP Chief JP Nadda resigns from Rajya Sabha(Political news telugu): బీజేపీ నేత జేపీ నడ్డా సోమవారం రాజ్యసభకు రాజీనామా చేశారు. అధికారిక ప్రకటన ప్రకారం, బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్య సభలో హిమాచల్ ప్రదేశ్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు.
రాజ్యసభ పత్రికా ప్రకటనలో, “హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభకి ఎన్నికైన సభ్యుడు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా రాజ్యసభలో తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అతని రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించారు.”
కాగా జేపీ నడ్డా రాజ్యసభ గతంలో గుజరాత్ నుంచి ప్రాతినిథ్యం వహించారు. ఏప్రిల్ లో పదవీ కాలం ముగియనున్న 57 మంది సభ్యుల్లో జేపీ నడ్డా ఒకరు. ఇటీవల ముగిసిన రాజ్యసభ ఎన్నికల్లో నడ్డా హిమాచల్ ప్రదేశ్ నుంచి ఏకగ్రీవంగా గెలిచారు. తాజాగా జేపీ నడ్డా రాజీనామాతో ఆ సీటు ఖాళీ అయ్యింది.