E-Paper
Advertisement

Maharashtra : పోలీసును చెంపదెబ్బ కొట్టిన ఎమ్మెల్యే.. బీజేపీ నేత తీరుపై విమర్శలు..

Maharashtra : పోలీసును చెంపదెబ్బ కొట్టిన ఎమ్మెల్యే.. బీజేపీ నేత తీరుపై విమర్శలు..
Telugu news live today

Maharashtra latest news(Telugu news live today):

పోలీసు అధికారిపై బీజేపీ ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ పుణెలోని సాసూన్‌ ఆస్పత్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అజిత్‌ పవార్‌తోపాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ప్రోగామ్ కు హాజరయ్యారు. వేదిక నుంచి కిందకు దిగుతున్న బీజేపీ ఎమ్మెల్యే సునీల్‌ కాంబ్లే పట్టు కోల్పోయి కింద పడబోయారు.

దీంతో ఆయన పక్కనే ఉన్న పోలీసు చెంపపై కొట్టారు. సునీల్‌ కాంబ్లే పుణె కంటోన్మెంట్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పోలీసుపై ఆయన చర్యను ప్రజలు విమర్శిస్తున్నారు. కార్యక్రమానికి ఆహ్వానించే పత్రికలో తన పేరు లేకపోవడమే కోపానికి కారణమని అందువల్లే సహనం కోల్పోయి ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×