BigTV English

BJP MP Death News: బీజేపీ ఎంపీ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం..

BJP MP Death News: బీజేపీ ఎంపీ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం..

BJP MP Srinivas prasad death news(Telugu news live): కర్ణాటక చామరాజనగర్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి వి. శ్రీనివాస ప్రసాద్ సోమవారం కన్నుమూశారు. బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.


శ్రీనివాస ప్రసాద్.. చామరాజనగర్‌ నుంచి ఆరుసార్లు ఎంపీగా, మైసూరు జిల్లా నంజన్‌గూడ్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ట్వీట్ చేశారు. ‘‘సీనియర్ నాయకుడు, చామరాజనగర్ ఎంపీ శ్రీ వి.శ్రీనివాస ప్రసాద్‌ మృతి చెందడం నాకు చాలా బాధ కలిగించింది. సామాజిక న్యాయం కోసం పోరాడిన ఆయన తన జీవితాన్ని పేద, అణగారిన, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం అంకితం చేశారు. అతను తన వివిధ సమాజ సేవ పనులకు బాగా ప్రాచుర్యం పొందాడు. అతని కుటుంబానికి, మద్దతుదారులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి” అని ట్విట్టర్ వేదికగా మోదీ సంతాపం తెలియజేశారు.


ఈ ఏడాది మార్చి 18న దాదాపు 50 ఏళ్ల ప్రజా జీవితానికి ముగింపు పలికిన ప్రసాద్ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.

శ్రీనివాస ప్రసాద్ 1976లో జనతా పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1979లో కాంగ్రెస్‌లో చేరాడు. బీజేపీలో చేరడానికి ముందు అతను JD(S), JD(U), సమతా పార్టీలతో కూడా కొనసాగారు. ప్రసాద్ 1999 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల, ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి, 2013లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో రెవెన్యూ, దేవదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2016లో ప్రసాద్ కర్ణాటక అసెంబ్లీకి రాజీనామా చేసి మళ్లీ బీజేపీలో చేరారు. 2017లో నంజన్‌గూడ్ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో చామరాజనగర్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు.

Tags

Related News

Freebies Cobra Effect: ఉచిత పథకాలు ఎప్పటికైనా నష్టమే.. కోబ్రా ఎఫెక్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Missile from Rail: దేశంలో తొలిసారి రైలు మొబైల్ లాంచర్.. అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం సక్సెస్

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

Big Stories

×