Arvind Kejriwal Petition updates(Telugu flash news): ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్.. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేయనుంది. కాగా.. అరెస్ట్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈడీ కౌంటర్ ఫైల్ చేసింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. అరవింద్ కేజ్రీవాల్ కు 9 సార్లు సమన్లు జారీ చేసినా విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నట్లు ఈడీ అఫిడవిట్ లో పేర్కొంది. ఈ కేసులో కేజ్రీవాల్ హస్తం ఉందనేందుకు దర్యాప్తు చేసిన అధికారుల వద్ద ఆధారాలున్నాయని, ఆయనను చట్టబద్ధంగానే అరెస్ట్ చేశామని పేర్కొంది. దీనిపై కేజ్రీవాల్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు.
Also Read : కేజ్రీవాల్ ఆరోగ్యం బాగానే ఉంది.. ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
లోక్ సభ ఎన్నికల ముందు తనను అరెస్ట్ చేసి.. ఎన్నికల మోడల్ కోడ్ కండక్ట్ ను ఉల్లంఘించారని అందులో పేర్కొన్నారు. ఆప్ కు సౌత్ గ్రూప్ నుంచి నిధులు అందాయని, వాటిని గోవా ఎన్నికలకకు ఉపయోగించారన్న ఆరోపణల్లో నిజంలేదని తెలిపారు. ఈ కుంభకోణంలో కవిత, కేజ్రీవాల్ ల అరెస్టులు సంచలనం రేపాయి. మార్చి 21న ఈడీ అధికారులు రెండున్నర గంటల సమయంపాటు తనిఖీలు చేసిన తర్వాత.. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు.