BigTV English
Advertisement

Blackout In Jammu: జమ్మూలో బ్లాక్ అవుట్, పేలుళ్ల శబ్దాలు.. ఒమర్ అబ్దుల్లా ట్వీట్‌

Blackout In Jammu: జమ్మూలో బ్లాక్ అవుట్, పేలుళ్ల శబ్దాలు.. ఒమర్ అబ్దుల్లా ట్వీట్‌

Blackout In Jammu: పాక్ డ్రోన్ల ఉదంతానికి మన సైనికులు బుద్ధి చెప్పినా పాక్ మాత్రం కుక్క బుద్ధి మానుకోలేదు. జమ్మూలో శుక్రవారం సాయంత్రం కాస్త ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు ఊతమిచ్చేలా జమ్మూ నగరంలో అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, నగరమంతా చీకట్లో కూరుకుపోయిన దృశ్యాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్‌లో పంచుకోవడం విశేషం.


ఒమర్ అబ్దుల్లా ట్వీట్ ప్రకారం..
కాశ్మీర్ నగరమంతా బ్లాక్ అవుట్ అయ్యిందని, సైరన్లు గంభీరంగా వినిపిస్తున్నాయని ఒమర్ ట్వీట్ చేశారు. ఎడతెరిపిలేని పేలుళ్ల శబ్దాలు కూడా వినిపిస్తున్నాయని, ఇవి బహుశా హెవీ ఆర్టిలరీ గన్ ధ్వనులు కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే భద్రతా విభాగాలు జారీ చేసిన సూచనల మేరకు ఎవ్వరూ బయటకు రావద్దని ఆయన సూచించారు.

అపోహలకు లోనుకాకుండా అధికారిక సమాచారం కోసం వేచి ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జమ్మూలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా, ఆయన మరో విజ్ఞప్తి చేశారు. సైనికులు, భద్రతా విభాగాలు తమ విధులను నిర్విరామంగా నిర్వర్తిస్తుండగా, పౌరులు శాంతియుతంగా, జాగ్రత్తగా ఉండడం అత్యవసరమని ఒమర్ అభిప్రాయపడ్డారు.


పాక్ కు గట్టి బుద్ధి చెప్పిన సైనిక్స్
సాంబా సెక్టార్, పఠాన్ కోట్, పోఖ్రాన్ సహా సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి పాకిస్తాన్ డ్రోన్ లు తిరగబడ్డాయి. పాక్ డ్రోన్లను భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థంగా గుర్తించి వెంటనే తుపాకుల మోత మోగించింది. జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. మన సైన్యం దెబ్బకు పాక్ తోకముడిచిందని తెలుస్తోంది. ముందస్తుగా మన సైన్యాన్ని కేంద్రం అప్రమత్తం చేయడంతో పాక్ డ్రోన్స్ ఆటలు సాగలేదని తెలుస్తోంది.

భద్రతా దళాలు హై అలర్ట్‌లో..
సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పఠాన్ కోట్ ప్రాంతంలో సైనిక బలగాలు భారీగా మోహరించాయి. జమ్ముకశ్మీర్‌లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల్లో భారత భద్రతా దళాలు పూర్తి హై అలర్ట్‌లో ఉన్నాయి. వాయుసేన, ఆర్మీ మిస్సైల్ యూనిట్లు అప్రమత్తంగా చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×