E-Paper
Advertisement

Boeing 737 MAX : బోయింగ్‌ కలకలం.. ఓ విమానంలో లోపాన్ని గుర్తించిన డీజీసీఏ..

Boeing 737 MAX : భారత్‌లో కూడా బోయింగ్‌ 737 మ్యాక్స్ విమానంలో ఓ లోపం బయటపడినట్లు డీజీసీఏ ప్రకటించింది. బోయింగ్‌ 737 మ్యాక్స్‌ రకం విమానాలు వైమానిక రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇటీవల వీటిల్లో పలు లోపాలు బయటపడ్డాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్‌లైన్స్‌లలో ప్రభుత్వాలు తనిఖీలు చేపట్టాయి. తాజాగా భారత్‌లోనూ వైమానిక రంగ నియంత్రణ సంస్థ (డీజీసీఏ) దీనిపై దృష్టి సారించింది. దేశంలో ఈ రకం విమానాలు మొత్తం 40 ఉన్నాయి. వీటిలో ఆకాశ ఎయిర్‌ (22), ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ (9) స్పైస్‌ జెట్‌ (9)లను నడుపుతున్నాయి.

Boeing 737 MAX : బోయింగ్‌ కలకలం.. ఓ విమానంలో లోపాన్ని గుర్తించిన డీజీసీఏ..
Boeing 737 MAX

Boeing 737 MAX(Today news paper telugu):

భారత్‌లో కూడా బోయింగ్‌ 737 మ్యాక్స్ విమానంలో ఓ లోపం బయటపడినట్లు డీజీసీఏ ప్రకటించింది. బోయింగ్‌ 737 మ్యాక్స్‌ రకం విమానాలు వైమానిక రంగాన్ని కుదిపేస్తున్నాయి. ఇటీవల వీటిల్లో పలు లోపాలు బయటపడ్డాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్‌లైన్స్‌లలో ప్రభుత్వాలు తనిఖీలు చేపట్టాయి. తాజాగా భారత్‌లోనూ వైమానిక రంగ నియంత్రణ సంస్థ (డీజీసీఏ) దీనిపై దృష్టి సారించింది. దేశంలో ఈ రకం విమానాలు మొత్తం 40 ఉన్నాయి. వీటిలో ఆకాశ ఎయిర్‌ (22), ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ (9) స్పైస్‌ జెట్‌ (9)లను నడుపుతున్నాయి.

తాజాగా ఈ విమానాల్లో డీజీసీఏ తనిఖీలు చేపట్టింది. ఒక విమానంలో వాషర్‌ లేనట్లుగా గుర్తించినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 39 విమానాల్లో తనిఖీలు పూర్తయ్యాయని తెలిపింది. 40వ దానిలో వాషర్‌ కనిపించలేదని డీజీసీఏ తెలిపింది. ఈ విషయం బోయింగ్‌ దృష్టికి తీసుకెళ్లామని తెలియజేశారు. ఆ సంస్థ సూచించిన విధంగా చర్యలు తీసుకుంటామని డీజీసీఏ వెల్లడించింది.

అలాస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 మ్యాక్స్‌ 9 రకం విమానం 177 మంది ప్రయాణికులతో గాల్లో ఉండగా.. డోర్‌ప్లగ్‌ ఊడిపోయింది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత నెల చివర్లో ఓ 737 మ్యాక్స్‌ విమానం రడ్డర్‌ కంట్రోల్‌ వ్యవస్థలో కీలకమైన బోల్ట్‌కు నట్లు లేనట్లుగా అధికారులు గుర్తించారు.

ఐదేళ్ల క్రితం నెలల వ్యవధిలోనే ఇధియోపియాల, ఇండోనేషియాలో రెండు బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు కూలి 346 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 20 నెలల పాటు ఈ రకం విమానాలను ఉపయోగించలేదు. ప్రపంచ చరిత్రలోనే అత్యంత ఖరీదైన కార్పొరేట్‌ విషాదంగా ఈ ఘటన నిలిచింది. అనంతరం బోయింగ్‌కు దాదాపు 20 బిలియన్‌ డాలర్ల మేర నష్టం వచ్చింది. ఆ తర్వాత కూడా పలు లోపాలు ఈ విమానాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి.

Tags

Related News

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

Big Stories

×