BigTV English
Advertisement

Rahul Gandhi : భారత్ జోడో న్యాయ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. ఢిల్లీకి రాహుల్ గాంధీ..

Rahul Gandhi : భారత్ జోడో న్యాయ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. ఢిల్లీకి రాహుల్ గాంధీ..
Rahul Gandhi

Rahul Gandhi : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అస్సాం నుంచి పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహర్‌ జిల్లాలోకి గురువారం న్యాయ్ యాత్ర ప్రవేశించింది. ముందుగా అనుకున్న రూట్ మ్యాప్ ప్రకారం కాకుండా బెంగాల్ లోని ఉత్తరాది జిల్లాల నుంచి బీహార్‌లోకి ప్రవేశించేలా రూట్ ఛేంజ్ చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలే ఇందుకు కారణమని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.


తాజాగా జేడీయూ (JDU) అధ్యక్షుడు, బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ కూడా బీజేపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు రెండు రోజులు బ్రేక్ తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కూచ్‌బెహర్‌‌లో రోడ్ షో నిర్వహించిన అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర తిరిగి జనవరి 28 న ప్రారంభమవుతుందని కాంగ్రెస్ తెలిపింది.

ఇండియా(INDIA) కూటమి నుంచి ప్రతిపక్ష పార్టీ నేతలు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. తృణముల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో సోలో గానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించాయి. ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన నీతీశ్‌ కుమార్‌ తిరిగి బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ, జేడీయూ నేతలు ఒకే విమానంలో పట్నా నుంచి ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. దీంతో కూటమిని నీతీశ్‌ కుమార్ వీడితే మిగిలిన పార్టీలతో కలిసి అనుసరించాల్సిన కార్యాచరణ, వ్యూహాలపై పార్టీ ముఖ్య నేతలతో చర్చించేందుకు రాహుల్‌ ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.


Related News

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Big Stories

×