Bus Catche Fire: పుదుచ్చేరి ప్రాంతంలో లగ్జరీ బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. బస్సు వెనుక వస్తున్న ఆటో డ్రైవర్ మంటలను గమనించి బస్సు డ్రైవర్ని అప్రమత్తం చేశాడు. ఈ ఘటనలో బస్సు మంటల్లో చిక్కుకుంది. 13 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. అసలు ఘటన ఎలా జరిగింది?
మంటల్లో చిక్కుకున్న లగ్జరీ బస్సు
పుదుచ్చేరి నుంచి కడలూరు మీదుగా పొల్లాచ్చికి సోమవారం రాత్రి 10 గంటలకు ఓ లగ్జరీ బస్సు బయలుదేరింది. బస్సులో 13 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు నురాడి రోడ్ ఫ్లైఓవర్ మీదుగా వెళుతుండగా ఒక్కసారిగా పొగలు రావడం మొదలైంది. బస్సు వెనుక వస్తున్న ఆటో డ్రైవర్ పొగ రావడం గమనించాడు.
వెంటనే బస్సుని ఓవర్ టేక్ చేసి ఆటోను అడ్డంగా ఆపాడు. అసలు విషయాన్ని డ్రైవర్కి చెప్పాడు. ఈలోగా బస్సు డ్రైవర్ వంతెన పక్కన బస్సుని ఆపాడు. ప్రయాణికులను దించేశాడు. ఆ సమయంలో ప్రయానికులు అరుపులు, కేకలు వేస్తూ బస్సు నుంచి కిందకు దిగేశారు. ఈలోగా మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి.
పుదుచ్చేరిలో ఘటన.. ఆటోడ్రైవర్ సమాచారంతో
ఘటన కారణంగా కొంతమంది ప్రయాణికులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు తమ వస్తువులను బస్సులో వదిలేశారు. రోడ్డుపై బస్సు మంటల్లో చిక్కుకుంది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అప్పటికే బస్సు మొత్తం కాలిపోయింది. దాదాపు అరగంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన కారణంగా పుదుచ్చేరి-నూరడి రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఆ రూట్లో వెళ్లే వాహనాలను వేరే మార్గంలో దారి మళ్లించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన ఎలా జరిగింది? అనేదానిపై డ్రైవర్, ప్రయాణికుల నుంచి వివరాలు సేకరించారు.
ALSO READ: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అస్వస్థత.. ఎయిమ్స్లో చేరిక!