E-Paper
Advertisement

Good News For Farmers: రైతులకు శుభవార్త.. ఖరీఫ్ లో రూ. 24,420 కోట్ల రాయితీ..

Good News For Farmers: రైతులకు శుభవార్త.. ఖరీఫ్ లో రూ. 24,420 కోట్ల రాయితీ..

 

Good news for farmers

Cabinet approves ₹24,420 crore fertilizer subsidy for kharif season: ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల నిరసనల మధ్య రైతులకు సబ్సిడీ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాబోయే ఖరీఫ్ సీజన్ లో ఎరువులపై పోషక – ఆధారిత సబ్సిడి (NBS) రేట్లను నిర్ణయించడానికి NBS పథకం క్రింద 3 కొత్త ఎరువుల గ్రేడ్ లను ఖరీఫ్ సీజన్ 2024 (ఏప్రిల్ 1 నుంచి సెప్టంబర్ 30) వరకు ఎరువులపై రూ. 24,420 కోట్ల రాయితీని ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

రైతులు ఎప్పటిలాగే రూ. 1350 ధరకే 50 కిలోల డీఏపీని పొందవచ్చని వెల్లడించింది. ముఖ్యంగా ఈ పథకం రైతులకు తక్కువ ధరకు లభ్యమయ్యేలా చూస్తుందని కేంద్ర మంత్రివర్గం గురువారం అధికార ప్రకటనలో తెలిపింది. అలాగే దేశంలో కొత్తగా మరో మూడు సెమీ కండక్టర్ల తయారీ యూనిట్ స్థాపనకు కేబినేట్ ఆమోదముద్ర వేసింది.

Read more:  సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుకు భారీ సబ్సిడీ.. పీఎం సూర్యఘర్ స్కీమ్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రివర్గం ఒక ప్రకటనలో వెల్లడించింది. టాటా గ్రూప్, జపాన్ కి చెందిన రెసినస్ వంటి కంపెనీలు కలిసి రూ. 1,26 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ మూడు యూనిట్లు కలిసి ఏర్పాటు చేయనున్నాయి. ఆటో ముబైల్, టెలికమ్యూనికేషన్, రక్షణ వంటి రంగాలకు అవసరమైన సెమీ కండక్టర్లను తయారు చేస్తారు.

రాయల్టిరేటు స్పెసిఫికేషన్ ఆమోదం లభించడం వల్ల దేశంలో తొలిసారిగా ఈ 12 ఖనిజాల బ్లాకులను వేలం వేయడానికి కేంద్రం వీలు కల్పిస్తుంది. ఖనిజాలపై రాయల్టి రేటు అనేది బ్లాకుల వేలంలో బిడ్డర్లకు ముఖ్యమైన ఆర్ధికపరమైన అంశంపై కూడా కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×