BigTV English

Rahul Gandhi Bharat Jodo Yatra: ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. నేడు భారీ బహిరంగ సభ!

Rahul Gandhi Bharat Jodo Yatra: ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. నేడు భారీ బహిరంగ సభ!

Rahul GandhiRahul Gandhi Conclude Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన రెండో విడత భారత్ జోడో న్యాయ యాత్ర శనివారంతో ముగిసింది. ఈ ఏడాది జనవరి 14న మణిపూర్‌ నుంచి 6,700 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభించిన రెండు నెలల తర్వాత రాహుల్ గాంధీ ఈ యాత్రకు ముంబయిలోని దాదర్ ప్రాంతం వద్ద ముగించారు. అయితే ఈ రోజు విపక్షాల ఇండియా కూటమి ముంబయిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. ఆదివారం మణిభవన్‌ నుంచి ఆగస్టు క్రాంతి మైదాన్‌ వరకు ‘న్యాయ్‌ సంకల్ప్‌ పాదయాత్ర’ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సందర్భంగా జరిగే ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ లు హాజరుకానున్నారు.


రాహుల్ గాంధీ చేపట్టిన రెండో విడత భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపుర్‌ నుంచి ముంబయి వరకు 63 రోజులపాటు కొనసాగింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలైనందున రాహుల్ గాంధీ తన యాత్ర ముంబైలోని దాదర్‌ వద్దకు రాగానే ఆపేశారు. రాహుల్ తో పాటుగా ఆ ముంగిపు కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముంబయిలోని బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారకం ‘చైత్యభూమి’ వద్ద రాహుల్, ప్రియాంక, స్థానిక కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. అనంతరం రాహుల్ గాంధీ అక్కడే రాజ్యాంక పీఠిక చదివారు.

Also Read: Jammu Kashmir Aseembly Elections : జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు.. సీఈసీ క్లారిటీ..


యాత్రను విజయవంతంగా నిర్వహించినందుకు ప్రియాంకా గాంధీ.. రాహుల్ కు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత ఆమె ప్రజలు ఉద్దేశించి మాట్లాడారు. ‘కేంద్ర ప్రభుత్వం వైఫ్యలాలు, దానికి సంబంధిన నిజాలను ప్రజలకు చెప్పేందుకే రాహుల్ ఈ యాత్ర చేశారు. ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు ఈ యాత్రను నిర్వహించారు’ అని తెలిపారు. మహారాష్ట్రలో రాహుల్ గాంధీ యాత్రను మార్చి 17న ముగియాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఒకరోజు ముందే ముగించాల్సి వచ్చిందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు.

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×