BigTV English
Advertisement

Citizenship Amendment Act: పౌరసత్వ సవరణ చట్టం-2019 అమలుకు చర్యలు.. నోటిఫికేషన్ జారీ

Citizenship Amendment Act: పౌరసత్వ సవరణ చట్టం-2019 అమలుకు చర్యలు.. నోటిఫికేషన్ జారీ


Citizenship Amendment Act Notification: ఎంతో వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ చట్టం-2019 (Citizenship Amendment Act – CAA)కు సంబంధించిన విధి విధానాలు, అమలు నిబంధనలను.. నాలుగేళ్ల తర్వాత నేడు ప్రకటించింది.  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వీటిని గెజిట్ విడుదల చేసింది.

పౌరసత్వ సవరణ చట్టం – 2019 కి డిసెంబర్ లోనే రాష్ట్రపతి అనుమతి లభించింది. కేబినెట్ ఆమోదం కూడా వచ్చింది. కానీ.. దీనిపై నిబంధనలు ఇంతవరకూ రాకపోవడంతో ఈ చట్టం అమల్లోకి రాలేదు. తాజాగా ఈ చట్టం విధివిధానాలపై కేంద్రం ప్రకటన చేసింది. లోక్ సభ ఎన్నికలకు మరో నాలుగురోజుల్లో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో.. అంతకంటే ముందే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయాలని కేంద్రం భావించింది.


ఇటీవల కేంద్రహోంమంత్రి అమిత్ షా సైతం దీనిపై మాట్లాడారు. CAAపై లోక్ సభ ఎన్నికలకు ముందే నోటిఫికేషన్ విడుదలవుతుందని పేర్కొన్నారు. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ నేతల వాగ్ధానమేనని షా తెలిపారు. దేశ విభజన తర్వాత పొరుగు దేశంలో వేధింపులకు గురవుతున్న వారికి పౌరసత్వం కల్పిస్తామని వాగ్ధానం చేసిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ తర్వాత దానిని నుంచి వెనక్కి తగ్గిందన్నారు. సీఏఏ పేరు చెప్పి ముస్లింలను భయపెడుతున్నారని, నిజానికి దీనివల్ల ఎవరి పౌరసత్వానికీ ఇబ్బంది ఉండదని తెలిపారు.

Read More: కొత్త ఎన్నికల కమిషనర్ల నియామకంపై వివాదం.. సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్..

పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్ లలో హింసకు గురై భారత్ కు వలసగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇచ్చేందుకు తీసుకొచ్చిన చట్టం సీఏఏ అని అమిత్ షా వివరించారు. ఈ ప్రక్రియ అంతా ఆన్ లైన్ లోనే జరుగుతుంది. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ.. దీనిపై కీలక ప్రకటన చేస్తారని సమాచారం.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×