BigTV English
Advertisement

Chandipura Virus Danger Bells: డేంజర్‌గా మారిన చాందిపురా వైరస్.. ఆరుగురు మృతి..!

Chandipura Virus Danger Bells: డేంజర్‌గా మారిన చాందిపురా వైరస్.. ఆరుగురు మృతి..!

6 Died with Chandipura Virus in Gujarat and Rajasthan: దేశంలో సీజన్ మారడంతో రకరకాల వైరస్‌లు విజృంభిస్తున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఇబ్బందులు తెస్తున్నాయి. వీటి బారినపడి చనిపోతున్న ఘటనలూ లేకపోలేదు. తాజాగా గుజరాత్‌లో చాందిపురా వైరస్ కలకలం రేపుతోంది. గడిచిన ఐదురోజుల్లో ఆరుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు.


చాందిపురా వైరస్ దాటికి ఒక్క గుజరాత్‌లో ఐదుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో మరో 12 మందికి సోకినట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. ఈ వైరస్ విషయంలో నిర్లక్ష్యం వద్దని చెబుతున్నారు డాక్టర్లు. వైరస్ క్రమంలో విస్తరించి మెదడుకి చేరుతుందని అంటున్నారు. దీని లక్షణాలు జ్వరం, తలనొప్పి, వాంతులు, వీక్‌నెస్ వంటివి ప్రధాన లక్షణాలుగా చెబుతున్నారు.

ఈ వైరస్ దోమలు, పేలు, ఇసుక ఈగల ద్వారా వ్యాపిస్తుంది. తొలిసారి ఇండియాలో 1965 ఏడాది మహారాష్ట్రలో కేసు నమోదైంది. అప్పటి నుంచి ప్రతీ ఏడాది గుజరాత్‌లో ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ఇండియాలోనే కాదు ఆసియా, ఆఫ్రికా లాంటి ఖండాల్లో ఈ వైరస్ ఉంది.


గుజరాత్‌లో వైద్య నిఫుణులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. హెల్త్ టీమ్‌లను గ్రామీణ ప్రాంతాలకు పంపిస్తున్నారు. దీని ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు, ఈగలు కుట్టకుండా దోమ తెరలు వాడాలని సలహా ఇస్తున్నారు.

Also Read: బెంగుళూరులో ఆటోమెటిక్ పానీపూరి మెషిన్.. వాటర్ మాటేంటి?

గుజరాత్-రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు వైద్యాధికారులు. ఉదయపూర్ జిల్లాలోని ఖేర్వారా, అఖివాడ గ్రామాల్లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంతాలు గుజరాత్ సరిహద్దుల్లో ఉన్నాయి. ఆ ప్రాంతాలకు చెందిన ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వైరస్ విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.

Related News

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Big Stories

×