E-Paper
Advertisement

Chennai Floods: వీడని వరద.. 17కు పెరిగిన మృతులు.. 61,666 పునరావాసాలు ఏర్పాటు

Chennai Floods: వీడని వరద.. 17కు పెరిగిన మృతులు.. 61,666 పునరావాసాలు ఏర్పాటు
Advertisement
Chennai Floods Update

Chennai Floods Update(Telugu breaking news):

మిగ్ జాం తుపాన్‌.. చెన్నైలో తీరని నష్టాన్ని మిగిల్చింది. మొత్తం చెన్నై నగరమంతా.. పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. జాతీయరహదారులు, రైల్వే మార్గాలు సైతం .. ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి. ఎటు చూసినా మొత్తం వరదే కనిపిస్తోంది. అంతలా నగరాన్ని తుఫాను తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడప్పుడే చెన్నై ఈ వరదల నుంచి కోలుకునేలా కనిపించడం లేదు. కొన్నిచోట్ల వాహనాలు నీటిలో మునిగిపోయాయి. చిన్న చిన్న ఇళ్ల నుంచి పెద్ద పెద్ద ఇళ్లు సైతం వరదలోనే ఉన్నాయి. చాలామంది ఇంకా సురక్షిత ప్రాంతాల్లోనే ఉన్నారు. అత్యవసరమైన వారు రక్షణా సిబ్బంది సహాయంతో పడవలపై వెళ్తున్నారు.

కాగా.. భారీ వర్షాలు, వరదల కారణంగా చెన్నైలో 17 మంది మరణించగా.. మరో 11 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. డిస్ట్రిక్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ వర్షాల కారణంగా నీటమునిగిన కాలనీల్లో సహాయక చర్యలు చేపట్టాయి. ఫిషింగ్ బోట్స్, టాక్టర్ల సహాయంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ముతియాపేట్ వద్ద 54 కుటుంబాలను వరదల నుంచి రక్షించారు. సాలిగ్రామం నగరంలో అప్పుడే బిడ్డకు జన్మనిచ్చిన బాలింతను బిడ్డతో సహా సురక్షిత ప్రాంతానికి తరలించారు. కొట్టుపురంలో ఒక స్కూల్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి 250 మందిని తరలించారు.

Advertisement

22 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వర్షపు నీటిలో చిక్కుకోగా.. వారిని రక్షించి పల్లవరంలోని మిడిల్ స్కూల్ కు తరలించారు. చెన్నై సహా మొత్తం 9 జిల్లాల్లో నీటమునిగిన ప్రాంతాలకు చెందిన వారి కోసం 61,666 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సీఎం స్టాలిన్ వెల్లడించారు. ఇప్పటి వరకూ 11 లక్షల ఆహార పొట్లాలు, లక్ష పాల ప్యాకెట్లను బాధితులకు అందజేసినట్లు తెలిపారు.

Tags

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×