BigTV English
Advertisement

Chennai Techie Suicide: చిన్నారి తల్లిని చంపేసిన సోషల్‌మీడియా.. ఎందుకు.. ఏం జరిగింది..?

Chennai Techie Suicide: చిన్నారి తల్లిని చంపేసిన సోషల్‌మీడియా.. ఎందుకు.. ఏం జరిగింది..?

Chennai Techie Suicide after Being Shamed Online: సోషల్‌మీడియాలో నెటిజన్ల వ్యవహారశైలితో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకుంది. 8 ఎనిమిది నెలల చిన్నారిని అనాధను చేసింది. దీనికి కారణం నెటిజన్లా? ముమ్మాటికీ అవుననే సమాధానం వస్తోంది. అసలేం జరిగింది? ఇంకా లోతుల్లోకి వెళ్తే..


తమిళనాడుకి చెందిన 33 ఏళ్ల రమ్య అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకుంది. సోషల్‌మీడియాలో తనను ట్రోల్ చేయడంతో అవమానం తట్టుకోలేకపోయింది. ఈ విషయంలో తోటి ఉద్యోగుల నుంచి అదే పరిస్థితి ఎదురైంది. అందరూ ఆమెని నిందితురాలిగా చూడడం తట్టుకోలేకపోయింది. దీనికి పరిష్కారం తన చావే కారణమని భావించింది.

కట్టుకున్న భర్త, చివరకు పేరెంట్స్‌కు మనసు విప్పి తన బాధను చెప్పలేదు. భర్త ఇంటి నుంచి పేరెంట్స్ వద్దకు వచ్చింది. తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో సూసైడ్ చేసుకుని ఈ లోకాన్ని విడిచి పెట్టింది. 9 నెలల బేబిని అనాథను చేసింది. దీనికి పాపం ఎవరిది..? అనే ప్రశ్న రైజ్ అవుతోంది.


Also Read: బెంగుళూరులో రేవ్ పార్టీ, టాలీవుడ్ నటీనటులు, ఏపీ మంత్రి కారు కూడా..

నెలరోజుల కిందట వెనక్కి వెళ్తే.. చెన్నైలోని వీజీఎన్ స్టాఫర్డ్ అపార్టుమెంట్ నాలుగో ఫ్లోరులో వెంకటేష్-రమ్య దంపతులు ఉంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. బాబుకు నాలుగేళ్లు కాగా, బేబీకి ఏడు నెలల పసికందు. అయితే ఏప్రిల్ 28న రూఫ్‌పై ఏడేళ్ల చిన్నారి ప్రమాదకర స్థితిలో చిక్కుకుంది.

చుట్టుపక్కల అపార్టుమెంట్ వాళ్ల చూసి చాకచక్యంగా బేబిని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది. సరిగ్గా ఘటన జరిగిన నెలరోజులకు చిన్నారి తల్లి సూసైడ్ చేసుకుంది. తన అజాగ్రత్త వల్లే చిన్నారి రూఫ్‌పై చిక్కుకోవడంతో సోషల్‌మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో రమ్య మానసిక వేదనకు గురైంది. ఎవరికీ చెప్పుకోలేకపోయింది. ట్రోలింగ్ భూతం నుంచి బయట పడలేకపోయింది. చివరకు తాను చేసిన తప్పుకు చావు పరిష్కారమని భావించి సూసైడ్ చేసుకుంది.

 

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×