E-Paper
Advertisement

Chhattisgarh elections 2023 : ఛత్తీస్‌గఢ్ లో పోలింగ్ .. చెలరేగిన హింస.. ఐఈడీ పేలుడు..

Chhattisgarh elections 2023 : ఛత్తీస్‌గఢ్ లో పోలింగ్ .. చెలరేగిన హింస..  ఐఈడీ పేలుడు..
Chhattisgarh elections 2023

Chhattisgarh elections 2023(Politics news today India):

ఛత్తీస్ గఢ్, మిజోరాంలలో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలవ్వగా.. కొద్దిసేపటికే ఛత్తీస్ గఢ్ లో పేలుడు సంభవించింది. దీంతో మొదటి విడత ఎన్నికల్లో హింస చెలరేగింది. సుకుమా జిల్లా తొండమర్కలో జరిగిన ఐఈడీ పేలుడులో సీఆర్ పీఎఫ్ జవాన్ కు తీవ్రగాయాలయ్యాయి. బాధిత జవాన్ సీఆర్పీఎఫ్ కోబ్రా 206వ బెటాలియన్ కు చెందిన ఇన్ స్పెక్టర్ శ్రీకాంత్ అని అధికారులు వెల్లడించారు.

కాగా.. నక్సల్స్ పాతిపెట్టిన బాంబుపై కాలు వేయడంతో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. నేడు అక్కడ 20 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా.. వాటిలో పేలుడు జరిగిన కొంటా అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఉంది. తొలివిడత పోలింగ్ జరుగుతున్న 7 జిల్లాలు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. బస్తర్, జగదల్ పూర్, చిత్రకోట్ లో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా.. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది.

Tags

Related News

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

Big Stories

×