మణిపూర్ శాంతిభద్రతలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిగా అక్కడ శాంతిని నెలకొల్పడంలో విఫలం చెందారని పరోక్షంగా కేంద్రప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రతి ఒక్కరూ ప్రజా సేవలో వినయంగా వ్యవహరించాలని సూచించారు.
బీజేపీకి కంచుకోటగా ఉన్న యూపీలో 80 ఎంపీ స్థానాల్లో ఎన్డీయే కూటమి 36 సీట్లను సాధించింది. దీనిలో బీజేపీ కేవలం 33 సీట్లనే కైవసం చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్ల లక్ష్యాన్ని పెట్టుకున్న బీజేపీ కేవలం 244 సీట్లనే గెలుచుకుంది.2014-2019 ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 సీట్లను మించి బీజేపీ గెలుచుకుంది.
Also Read: అమర్ నాథ్ యాత్ర, ఉగ్రదాడులు.. కాశ్మీర్ పరిస్థితిపై హోం మంత్రి అమిత్ షా సమీక్ష..
ఈనేపథ్యంలో యూపీ సీఎం యోగీతో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ భేటీ కావడం చర్చనీయాంశమైంది. నిన్న మధ్యాహ్నం ఒక పాఠశాల కార్యక్రమంలో పాల్గొన్న భగవత్ తో యోగీ అర్థగంట సేపు సమావేశమయ్యారు. ఆ తర్వాత రాత్రి 8గంటల 30 నిమిషాల తర్వాత మరో అరగంటపాటు భగవత్ తో పాటు యోగీ భేటీ అయ్యారు.