E-Paper
Advertisement

Another shock to IAS SriLaxmi: శ్రీలక్ష్మికి మరో షాక్, సంతకం పెట్టని మంత్రి

Another shock to IAS SriLaxmi:  శ్రీలక్ష్మికి మరో షాక్, సంతకం పెట్టని మంత్రి
Advertisement

Another shock to IAS SriLaxmi: ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి మరో షాక్ తగిలింది. ప్రస్తుతం పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్నారామె. ఆదివారం ఆ శాఖ మంత్రిగా నారాయణ సచివాలయం లో బాధ్యతలు చేపట్టారు. ఆ సందర్భంగా సంతకాల కోసం శ్రీలక్ష్మి ఓ ఫైల్ తెచ్చారు. దానిపై సంతకం పెట్టడానికి మంత్రి నారాయణ నిరాకరించారు. దీంతో ఆమె సైలెంట్ అయి.. ముఖం చిన్న బుచ్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ సన్నివేశాన్ని చూస్తూ ఉండిపోయారు తోటి ఉద్యోగులు. ఇదేకాదు సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన రోజు ఆయన ఛాంబర్‌కి డైరెక్ట్‌గా వెళ్లిపోయారు. సీఎం కాసింత కోపంగా చూడడంతో ఆమెని అక్కడి నుంచి పంపించేశారు సీఎస్. హాలులో ఉండాలని చెప్పడంతో శ్రీలక్ష్మి వెళ్లిపోయారు.

Advertisement

2019 ఎన్నికల ఫలితాలు తర్వాత తెలంగాణ నుంచి ఏపీకి డిప్యుటేషన్‌పై ఆమెని రప్పించారు జగన్. ఐదేళ్ల పాటు ఆమెకి తిరుగులేకుండా పోయింది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఫలితాల రోజు ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లిపోవాలని భావించారు. అందుకు అప్పటి సీఎస్ జవహర్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈలోగా గవర్నర్ నుంచి ఆదేశాలు రావడంతో ఆమె ఉండిపోయారు.

ALSO READ: రాజీనామాల పర్వం, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల రిజైన్

Advertisement

శ్రీలక్ష్మి బదిలీ అయ్యేవరకు ఆమె తీసుకొచ్చిన ఫైళ్లపై సంతకాలు పెట్టకూడదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైనింగ్ కేసులో ఇప్పుడిప్పుడే రిలాక్స్ అవుతున్న సమయంలో డిప్యుటేషన్‌పై ఏపీకి రావడం, ఇక్కడ చేదు అనుభవం ఎదురుకావడం ఆమెకి ఊహించని పరిణామం.

కేంద్రం, తెలంగాణ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులను ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేయలేదు. ఐదేళ్లలో వారు పని చేసిన శాఖలను మొత్తమంతా పరిశీలించిన తర్వాత పంపాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు వార్తలు జోరందుకున్నాయి.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×