BigTV English
Advertisement

Congress-DMK Seat Deal: తమిళనాడులో కాంగ్రెస్ డీఎంకే మధ్య కుదిరిన ఒప్పందం.. తొమ్మిది స్థానాల్లో హస్తం పోటీ..

Congress-DMK Seat Deal: తమిళనాడులో కాంగ్రెస్ డీఎంకే మధ్య కుదిరిన ఒప్పందం.. తొమ్మిది స్థానాల్లో హస్తం పోటీ..

Congress-DMK Seat DealCongress-DMK Seat Deal(Political news telugu): తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్ మధ్య సీట్ల సర్ధుబాటు పూర్తయినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేకే వేణుగోపాల్ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని 9 స్థానాలు, పుదుచ్చేరిలో ఒక స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనుంది.


మొత్తం తమిళనాడులో 39 ఎంపీ స్థానాలున్నాయి. కాంగ్రెస్ డీఎంకే పొత్తులో భాగంగా 21 స్థానాల్లో డీఎంకే, 9 స్థానాల్లో కాంగ్రెస్, వీసీకే పార్టీ 2, సీపీఐ(ఎం) 2, సీపీఐ 2, ముస్లీం లీగ్ 1, ఎండీఎంకే 1, కేఎండీకే ఒక్క స్థానంలో పోటీ చేయనున్నాయి. కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్‌కు 2025లో ఒక రాజ్య సభ సీటును కేటాయించేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి.

2019లో 10 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో 2024 ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ చేయాలని హస్తం పార్టీ భావిస్తోంది. తమిళనాడు సీఎం డీఎంకే అధ్యక్షుడు ఎం కే స్టాలిన్, టీసీసీసీ అధ్యక్షుడు సెల్వపెరున్‌తగాయ్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్, అజయ్ కుమార్ శనివారం సీట్ల సర్ధుబాటుపై సమావేశం నిర్వహించారు.


Read More: డీఎంకే కాంగ్రెస్‌ కూటమితో ఎంఎన్ఎమ్ పొత్తు.. పోటీకి దూరంగా కమల్ హాసన్ పార్టీ..

డీఎంకేతో పొత్తు పెట్టుకోవడం సంతోషంగా ఉందని.. తమిళనాడు, పుదుచ్చేరిలోని 40 సీట్లు గెలుస్తామని కేకే వేణుగోపాల్ స్పష్టం చేశారు. ఇక దేశం కోసం తమ కూటమిలో కమల్ హాసన్ చేరారని.. వారికి ఒక రాజ్య సభ సీటును కేటాయిస్తామని ఆయన తెలిపారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×