Congress Announced 10 MP Candidate for 2024 Lok Sabha Elections: కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణగోపాల్ మరో 10 మందితో లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.హైదరాబాద్ శంషాబాద్లోని నోవోటెల్లో కాంగ్రెస్ నేతల సమావేశంలో ఆయన పలు రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నుంచి పోటీ చేయనున్న ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం మేరకు.. ఢిల్లీలో 3 స్థానాలకు, పంజాబ్ లో 6 స్థానాలకు, ఉత్తరప్రదేశ్లో ఒక స్థానంకు మొత్తంగా 10 స్థానాలకు పార్లమెంట్ అభ్యర్థులను కేసీ వేణగోపాల్ ప్రకటించారు. దీంతో పాటుగా ఒడిశాలో 75 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులకు పేర్లను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణగోపాల్ వెల్లడించారు. త్వరలోనే రాష్ట్రంలో పెండింగ్ ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థులను ప్రకటించనుంది.