E-Paper
Advertisement

Delhi Bomb Threat: ఢిల్లీలో ఎర్రకోట, అసెంబ్లీల‌కు బాంబు బెదిరింపులు.. గంటల తరబడి ముమ్మర తనిఖీలు

Delhi Bomb Threat: ఢిల్లీలో ఎర్రకోట, అసెంబ్లీల‌కు  బాంబు బెదిరింపులు.. గంటల తరబడి ముమ్మర తనిఖీలు
Advertisement

Delhi Bomb Threat: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టించాయి. చారిత్రక కట్టడమైన ఎర్రకోట, ఢిల్లీ అసెంబ్లీ భవనానికి బాంబు పెట్టినట్లు వచ్చిన సమాచారంతో భద్రతా దళాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఈ బెదిరింపుల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు ఆయా పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి ముమ్మర తనిఖీలు నిర్వహించాయి. అత్యాధునిక పరికరాలు, జాగిలాల సాయంతో అణువణువూ గాలించిన అధికారులు.. అక్కడ ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు గుర్తించలేదని అధికారికంగా ధృవీకరించారు. ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని తేలడంతో అధికారులు, పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు.

కేవలం ఈ రెండు ప్రాంతాలే కాకుండా ఉదయం ఢిల్లీలోని పలు పాఠశాలలకు కూడా ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. ఈ వరుస సంఘటనల వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో పోలీసులు లోతైన విచారణ ప్రారంభించారు. సైబర్ క్రైమ్ విభాగం సాయంతో మెయిల్స్ పంపిన మూలాలను ఆరా తీస్తున్నారు. కాగా నిన్న జమ్మూకాశ్మీర్‌లో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో వరుస బెదిరింపులు రావడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా పరంగా రాజధానిలో నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు.

Advertisement

Read Also: Jamili : తెలంగాణలో జమిలి.. ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్?

Related News

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

Big Stories

Advertisement
×