E-Paper
Advertisement

Delhi Mayor : ఢిల్లీ మేయర్‌ ఎన్నికపై మళ్లీ రచ్చ.. మూడోసారి వాయిదా..

Delhi Mayor : ఢిల్లీ మేయర్‌ ఎన్నికపై మళ్లీ రచ్చ.. మూడోసారి వాయిదా..
Advertisement

Delhi Mayor : ఢిల్లీ మేయర్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. గతంలో రెండుసార్లు కౌన్సిల్ లో బీజేపీ, ఆప్ సభ్యుల మధ్య ఘర్షణ జరగడంతో మేయర్ ఎన్నిక వాయిదా పడింది. తాజాగా మూడోసారి అదే పరిస్థితి తలెత్తింది.

మేయర్‌ ఎన్నికలో నామినేటెడ్‌ సభ్యులు ఓటు వేసేందుకు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సత్యా శర్మ అనుమతి ఇచ్చారు. ప్రిసైడింగ్ అధికారి నిర్ణయంపై ఆప్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌన్సిల్ లో నిరసనకు దిగారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఆప్‌ సభ్యుల తీరును వ్యతిరేకిస్తూ బీజేపీ కౌన్సిలర్లు సభ నుంచి వెళ్లిపోయారు. ఆప్‌ కౌన్సిలర్లు మాత్రం కౌన్సిల్ లో నిరసన కొనసాగించారు. ఈ నేపథ్యంలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌, స్టాండింగ్‌ కమిటీ సభ్యులను ఎన్నుకోకుండానే సభ మరోసారి వాయిదా పడింది.

Advertisement

గత డిసెంబర్‌లో జరిగిన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌ విజయం దుందుభి మోగించింది. 15 ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడింది. మొత్తం 250 వార్డుల్లో 134 స్థానాలను కైవసం చేసుకుంది. మేయర్‌ పదవి ఆప్‌కే దక్కనుంది. కానీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన 10 మంది నామినేటెడ్ కౌన్సిలర్స్‌ చేత ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ ప్రమాణ స్వీకారం చేయించడం వివాదానికి కారణమయ్యింది. మేయర్ ఎన్నికలో నామినేటెడ్‌ సభ్యులు ఓటు వేయడానికి అనుమతి లేదని ఆప్‌ వాదిస్తోంది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆప్‌ ఆశ్రయించింది. సుప్రీంకోర్టు తీర్పు వస్తే గానీ ఢిల్లీ మేయర్ ఎన్నిక జరిగే పరిస్థితి కనిపించడంలేదు.

Tags

Related News

మురికి నదిని ఒంటరిగా శుభ్రం చేసిన పేద యువకుడు.. కట్ చేస్తే అంతర్జాతీయ కంపెనీ జాబ్ ఆఫర్

నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. ఆ నేరానికి ఇది చాలా చిన్న శిక్ష!

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

Big Stories

Advertisement
×