E-Paper
Advertisement

Delhi-Mumbai Expressway : ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే.. తొలిదశ ప్రారంభం.. ప్రత్యేకతలివే..!

Delhi-Mumbai Expressway : ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే.. తొలిదశ ప్రారంభం.. ప్రత్యేకతలివే..!

Delhi-Mumbai Expressway : దేశంలోనే అతి పెద్ద ఎక్స్ ప్రెస్ వే తొలిదశ ప్రారంభమైంది. ఢిల్లీ-ముంబై మధ్య ఈ ఎక్స్ ప్రెస్ వేను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. అందులో తొలిదశలో ఢిల్లీ-దౌసా- లాల్ సోట్ ల మధ్య రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ రహదారి పనులు పూర్తికావడంతో ఈ మార్గాన్ని రాజస్థాన్ లో దౌసాలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఢిల్లీ- ముంబై ఎక్స్‌ప్రెస్‌వే దేశాభివృద్ధిలో బలమైన స్తంభంగా నిలుస్తుందని మోదీ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. 2019 మార్చి 9న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. ఢిల్లీతోపాటు మధ్యలో హర్యానా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్రను కలుపుతూ 1,386 కిలోమీటర్ల మేర ఈ రహదారి ఉంటుంది. జైపూర్‌, అజ్‌మేర్‌, కోటా, ఉదయ్‌పూర్‌, చిత్తోర్‌గఢ్‌, భోపాల్‌, ఇండోర్, ఉజ్జయిని, అహ్మదాబాద్‌, సూరత్‌, వడోదరా లాంటి ప్రధాన పట్టణాలను ఈ రహదారి కలుపుతుంది.

ఈ రహదారి పూర్తైయితే ఢిల్లీ, ముంబై మధ్య ప్రస్తుతం ఉన్న దూరం 180 కిలోమీటర్లు తగ్గుతుంది. ప్రయాణ సమయ 12 గంటలు తగ్గుతుంది. ఈ రహదారి నిర్మాణం కోసం 5రాష్ట్రాల్లోని 15 వేల హెక్టార్ల భూమిని సమీకరించారు. సుమారు రూ.లక్ష కోట్లతో రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ ఏడాది చివరినాటికి ఈ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తిగా అందుబాటులోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది.

ప్రధాని మోదీ మరో 4 రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రూ.18,100 కోట్లతో ఈ రోడ్లు నిర్మిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పాల్గొన్నారు. తొలిదశలో మొత్తం 247 కిలోమీటర్ల రహదారిని 8 లేన్లుగా నిర్మిస్తారు. ఇందుకోసం రూ.10,400 కోట్లు నిధులు కేటాయించారు. ఈ రహదారి పూర్తైయితే మూడున్నర గంట్లలోనే ఢిల్లీ నుంచి జైపూర్‌ చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణానికి 5 గంటల సమయం పడుతోంది.

Tags

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×