E-Paper
Advertisement

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?
Advertisement

సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ చేసి, వాటి ద్వారా తెలిసినవారిని డబ్బులు అడగటం ఇటీవల చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. ప్రముఖుల ఖాతాలు కూడా వీటికి అతీతమేం కాదు, అయితే వారి ఖాతాల్ని హ్యాక్ చేసిన వారు ఏం చేస్తారు? వారిని ఎలా ఇబ్బంది పెడతారనేది ఎవ్వరూ అంచనా వేయలేని విషయం. అయితే కొన్నిసార్లు హ్యాకర్లు జస్ట్ శాంపిల్స్ రుచి చూపిస్తారంతే. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే విషయంలో కూడా ఇదే జరిగింది. మరింత నష్టం జరగకముందే సైబర్ టీమ్ యాక్టివ్ కావడంతో ఆయన ట్విట్టర్(X) ఖాతా తిరిగి పునరుద్ధరణకు గురైంది.

ఏం పోస్ట్ చేశారు..?
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే X ఖాతాను హ్యాకర్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. వెంటనే ఆయన ఖాతానుంచి పాకిస్తాన్, టర్కీ జెండాలను పోస్ట్ చేశారు. ఏక్ నాథ్ షిండే ట్విట్టర్ ఖాతాలో పాకిస్తాన్, టర్కీ జెండాలు ప్రత్యక్షం కావడంతో ఫాలోవర్లు షాకయ్యారు. అసలాయన ఆ పని ఎందుకు చేశారంటూ ఆరా తీశారు. తిరిగి ఆయనకే మెసేజ్ లు పెట్టారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే సైబర్ టీమ్ అప్రమత్తం అయింది. ఆయన అకౌంట్ హ్యాక్ అయిందని తెలుసుకుని దాన్ని తిరిగి రీస్టోర్ చేసే పని మొదలు పెట్టింది. అరగంటనుంచి 40 నిమిషాలు టైమ్ పట్టింది. ఆ తర్వాత అంతా సవ్యంగా మారింది. డిప్యూటీసీఎం ఏక్ నాథ్ షిండే X అకౌంట్ తిరిగి రీస్టోర్ అయింది.

Advertisement

భారత్ బదులు పాక్ జెండాలు..
ఈరోజు ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్‌ తో తలబడాల్సి ఉంది. సహజంగా భారత్ కి మద్దతుగా ఏక్ నాథ్ షిండే ట్వీట్ చేయాల్సి ఉంది. భారత్ జెండా ఉండాల్సిన చోట పాక్ జెండా ఉండటంతో నెటిజన్లు షాకయ్యారు. అసలు ఏక్ నాథ్ షిండే పాకిస్తాన్ కు ఎందుకు మద్దతు తెలిపారా అని అనుకున్నారు. టర్కీ జెండా కూడా ఉండటంతో ఆసియా కప్ నే టార్గెట్ చేసుకుని హ్యాకర్లు ఆ రెండు దేశాల జెండాలు ఉంచారనే అనుమానం బలపడింది. ఆ దిశగా సైబర్ టీమ్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది.

ఎవరిపని?
ఇటీవల అసోంకి చెందిన కాంగ్రెస్ నాయకుడి X ఖాతా కూడా ఇలాగే హ్యాకింగ్ కి గురైంది. అందులో ఆయనకు వ్యతిరేక పోస్ట్ లు కనిపించాయి. ఇప్పుడు మహారాష్ట్ర డిప్యూటీసీఎం X ఖాతా హ్యాకింగ్ కి గురైన విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సాక్షాత్తూ ఒక డిప్యూటీ సీఎం సోషల్ మీడియా పాస్ వర్డ్ క్రాక్ చేయడం సామాన్యులకు సాధ్యమవుతుందా, ఇది ఆకతాయిల పనా, లేక దీని వెనక పాకిస్తాన్ కుట్ర ఉందా అనే ఎంక్వయిరీ మొదలైంది. భారత్ లో చాలామంది ప్రముఖులు, తమ X ఖాతాల ద్వారానే అధికారిక సమాచారాన్ని బహిర్గతం చేస్తుంటారు. ఇలాంటి సమయంలో X ఖాతాలు కూడా హ్యాకర్ల పాలిట పడితే ఇక జనం ఏది నమ్మాలి అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. దీనిపై ఏక్ నాథ్ షిండే ఇంకా స్పందించలేదు. ఈ పని ఎవరిదో తేలాల్సి ఉంది.

Related News

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

ప్రాణం పోయే ఆఖరిక్షణం.. దేవదూతల్లా పెళ్లైన జంట ప్రత్యక్షం, యువ బైకర్ సేఫ్, వీడియో వైరల్

Big Stories

Advertisement
×